Bengaluru Double Murder: ఐటీ ఆఫీస్‌లో ఎండీ,సీఈవో హత్య కేసు, ప్రధాన నిందితుడుతో సహా ముగ్గురిని అరెస్ట్ చేసిన బెంగుళూరు పోలీసులు

బెంగళూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఏరోనిక్స్ ఇంటర్నెట్ అనే ఐటీ కంపెనీ ఎండీ ఫణీంద్ర సుబ్రహ్మణ్య, సీఈవో విను కుమార్ లను ఆ కంపెనీ మాజీ ఉద్యోగి ఫెలిక్స్ దారుణంగా హతమార్చాడు. కంపెనీలోకి ప్రవేశించిన ఫెలిక్స్ తన వెంట తెచ్చుకున్న కత్తితో వీరిద్దరినీ నరికాడు.

Aeronics Media CEO and MD Murder in Bengaluru (Photo Credit: ANI/Twitter)

Aeronics Media CEO and MD Murder Case: బెంగళూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఏరోనిక్స్ ఇంటర్నెట్ అనే ఐటీ కంపెనీ ఎండీ ఫణీంద్ర సుబ్రహ్మణ్య, సీఈవో విను కుమార్ లను ఆ కంపెనీ మాజీ ఉద్యోగి ఫెలిక్స్ దారుణంగా హతమార్చాడు. కంపెనీలోకి ప్రవేశించిన ఫెలిక్స్ తన వెంట తెచ్చుకున్న కత్తితో వీరిద్దరినీ నరికాడు. తీవ్రంగా గాయపడ్డ వీద్దరినీ కంపెనీ ఇతర ఉద్యోగులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే మార్గమధ్యంలోనే వీరు ప్రాణాలు కోల్పోయారు.

బెంగళూరులోని అమృతహళ్లిలో ఉన్న పంపా ఎక్స్ టెన్షన్ లో ఈ ఐటీ కంపెనీ ఉంది. ఫెలిక్స్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని నార్త్ ఈస్ట్ బెంగళూరు డీసీపీ లక్ష్మీప్రసాద్ తెలిపారు. ఫెలిక్స్ కూడా ప్రస్తుతం అటువంటి కంపెనీనే నిర్వహిస్తున్నాడని... అయితే, అతని బిజినెస్ కు వీరిద్దరూ ఆటంకాలను కల్పిస్తుండటంతోనే వారిని హతమార్చినట్టు చెపుతున్నారు.

బస్సు డ్రైవర్ నిర్లక్ష్యానికి 6 నిండుప్రాణాలు బలి, సీసీటీవీలో వీడియో చూస్తే ఒళ్లు గగుర్పాటుకు గురవడం ఖాయం..

హత్య చేసిన ఒక రోజు తర్వాత ప్రధాన నిందితుడితో సహా ముగ్గురిని బుధవారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇంటర్నెట్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్ ప్రొవైడర్ ఏరోనిక్స్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో), మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) హత్యకేసులో ప్రమేయం ఉన్న ముగ్గురిని అమృతహళ్లి పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం సాయంత్రం ఇక్కడ నివాస ప్రాంతమైన అమృతహళ్లి సమీపంలోని పంపా ఎక్స్‌టెన్షన్ వద్ద లిమిటెడ్ వద్ద వారిని అరెస్ట్ చేశారు.

ముగ్గురు వ్యక్తులను ప్రధాన నిందితుడు శబరీష్ అలియాస్ ఫెలిక్స్ (27), వినయ్ రెడ్డి (23), సంతోష్ అలియాస్ సంతు (26)గా గుర్తించారు. నిందితులు ఏరోనిక్స్ కార్యాలయంలోకి చొరబడి కంపెనీ సీఈవో వినుకుమార్ (40), ఎండీ ఫణీంద్ర సుబ్రహ్మణ్య (36)లను నరికి చంపారు.

కటార్లతో కార్యాలయంలోకి చొరబడి ఉద్యోగుల సమక్షంలోనే సుబ్రమణ్యపై దాడికి పాల్పడ్డారు. కుమార్ అతనిని రక్షించడానికి పరుగెత్తడంతో, అతను కూడా పదునైన ఆయుధాలతో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. వారు అక్కడి నుండి పారిపోయిన తర్వాత, ఉద్యోగులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించగా, బాధితులు మరణించారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement