News

Astrology: ఆగస్టు 31న రాహు ,బుధుడి కలయిక దీనివల్ల ఈ మూడు రాశుల వారికి సంపద పెరుగుతుంది.

sajaya

జ్యోతిష శాస్త్రం ప్రకారం బుధ గ్రహం రాముతో కలయిక వల్ల కొన్ని శుభశకునాలు వస్తాయి. దీని ద్వారా ముఖ్యంగా ఈ మూడు రాశులు వారికి కలిసి వస్తుంది. ఆ మూడు రాశులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Astrology: ఆగస్టు 19న కుజుడు మృగశిర నక్షత్రం లోనికి ప్రవేశం..దీని కారణంగా ఈ ఐదు రాశుల వారికి ఆర్థిక సమస్యలు పెరుగుతాయి.

sajaya

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుజుడు బలమైన గ్రహం. ఈ గ్రహం కదలిక వల్ల కొన్ని రాశుల వారు సమస్యలను ఎదుర్కొనవలసి వస్తుంది. ఈసారి ఆగస్టు 19వ తేదీన కుజుడు మృగశిర నక్షత్రంలోనికి ప్రవేశం. దీని కారణంగా ఐదు రాశుల వారికి సుమారు 15 రోజుల పాటు కష్టంగా ఉంటుంది ఇప్పుడు తెలుసుకుందాం.

Health Tips: జీవితకాలంఆరోగ్యంగా ఉండడానికి ఈ ఐదు సూత్రాలు పాటించండి..

sajaya

ప్రస్తుతం ప్రతి ఐదు మందిలో ఇద్దరు కచ్చితంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా యువత కూడా ఎక్కువ అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. బిజీ లైఫ్ కారణంగా వారి మానసిక ఆరోగ్యం పైన కూడా ప్రభావం చూపుతుంది. మన జీవన శైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా మన జీవితకాలం అంతా కూడా మనం ఆరోగ్యంగా ఉండవచ్చు

Health Tips: తరచుగా జ్వరం వస్తుందా..అయితే ఈ లక్షణాలు ఉంటే అది మలేరియా కావచ్చు

sajaya

మలేరియా అనేది ఒక తీవ్రమైన వ్యాధి. ఇది దోమల ద్వారా మానవులకు సంక్రమిస్తుంది. మలేరియా లక్షణాలు కారణాలు గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. దీన్ని సకాలంలో గుర్తించి చికిత్స చేసుకోపోతే అది ప్రాణాంతకంగా మారుతుంది.

Advertisement

Health Tips: భోజనం తర్వాత పది నిమిషాలు నడకతో మీ షుగర్ కంట్రోల్ అవుతుంది.

sajaya

ఈ రోజుల్లో చాలామంది ఇబ్బంది పడే సమస్య మధుమేహం. ఒకప్పుడు మధుమేహం కేవలం 50 ఏళ్లు దాటిన వారికి మాత్రమే వచ్చే ఒక దీర్ఘకాలిక సమస్య కానీ ప్రస్తుత సమయంలో ఇది చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి 20 మందిలో ఇద్దరినీ ఇబ్బంది పెట్టే సమస్య.

Sitarama Project: వీడియో.. సీతారామ ప్రాజెక్టు ట్రయల్ రన్ సక్సెస్, స్విచ్ ఆన్ చేసిన మంత్రి ఉత్తమ్ కుమార్‌, 15న ప్రాజెక్టును ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి

Arun Charagonda

ఖమ్మం జిల్లాలోని సీతారామ ప్రాజెక్టు ట్రయల్ రన్ సక్సెస్ అయింది. పుసుగూడెం పంప్ హౌస్ ట్రయల్ రన్ విజయవంతం అయింది. ట్రయల్ రన్ స్విచ్ ఆన్ చేశారు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి, తుమ్మలతో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ నెల 15న సీతారామ ప్రాజెక్టును సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు.

Health Tips; మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా, అయితే మీకు విటమిన్ డి లోపం ఉన్నట్లే.

sajaya

మన శరీరానికి విటమిన్ డి ఒక ముఖ్యమైన పోషకం. ఇది మనకు ఎముకల గట్టిదనానికి దంతాలను ,కాల్షియం గ్రహించడంలో ఈ విటమిన్ డి సహాయపడుతుంది. అదేవిధంగా మన రోగ నిరోధక శక్తిని బలోపేతం చేయడానికి కూడా ఈ విటమిన్ సహాయపడుతుంది.

Shamshabad Airport: షూలో రూ. కోటి బంగారం, దుబాయ్ నుండి వచ్చిన ప్రయాణికుడి షూలో బయటపడ్డ బంగారం, పట్టుకున్న డీఆర్ఐ అధికారులు

Arun Charagonda

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారాన్ని పట్టుకున్నారు డీఆర్‌ఐ అధికారులు. దుబాయ్ నుండి హైదరాబాద్‌కి గోల్డ్ స్మగ్లింగ్ చేస్తున్న వ్యక్తిని అరెస్టు చేశారు. షూలో పెట్టుకుని బంగారం స్మగ్లింగ్ చేస్తుండగా పట్టుకుని అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

Advertisement

Andhra Pradesh Rains: ఏపీలో మూడు రోజులు భారీ వర్షాలు, ప్రజలకు వాతావరణ శాఖ అలర్ట్, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ

Arun Charagonda

తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షం ముప్పు పొంచి ఉంది. రానున్న మూడు రోజుల్లో తెలంగాణ , ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.ఇప్పటికే కురిసిన భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాలు తడిసి ముద్దవగా మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలకు భయాందోళనకు గురవుతున్నారు.

Andhra Pradesh: వీడియో ఇదిగో, శ్రీకాకుళం జిల్లాలో ఏనుగుల గుంపు హల్ చల్...భయాందోళనలో రెండు గ్రామాల ప్రజలు, విద్యుత్ నిలిపేసిన అధికారులు

Arun Charagonda

శ్రీకాకుళం జిల్లాలో ఏనుగుల గుంపు హల్ చల్ సృష్టించింది. వంగర మండలం వివిఆర్ పేట, రాజుల గుమడ గ్రామల్లో తిష్ట వేశాయి ఏనుగుల గుంపు. భయాందోళనలో రెండు గ్రామాల ప్రజలు ఉండగా అప్రమత్తమై విద్యుత్ శాఖ అధికారులు చుట్టుపక్క గ్రామాలకు విద్యుత్ నిలిపివేశారు.

Viral Video: హైదరాబాద్ లో నార్సింగిలో ఘోర రోడ్డు ప్రమాదం.. కారులో ముగ్గురికి తీవ్రగాయాలు.. వీడియో వైరల్

Rudra

హైదరాబాద్ లోని నార్సింగిలో మై హోమ్ అవతార్ చౌరస్తాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాంగ్ రూట్లో వచ్చిన ఓ కారును వేగంగా వచ్చిన టిప్పర్ ఒకటి డీకొట్టింది.

Hindenburg-Adani Group: హిండెన్ బర్గ్ తాజా రిపోర్టు కుట్రపూరితం.. అదానీ గ్రూప్ స్పందన

Rudra

అమెరికాకు చెందిన షార్ట్ సెల్లింగ్ కంపెనీ హిండెన్ బర్గ్ తాజా నివేదికపై అదానీ గ్రూప్ స్పందించింది. సెబీ చైర్ పర్సన్ పై చేసిన ఆరోపణలు నిరాధారమని తేల్చిచెప్పింది.

Advertisement

Karnataka Anganwadi Workers: ఇదేందయ్యా.. ఇది..? పిల్లలకు ప్లేట్లలో గుడ్లు పెట్టినట్టే పెట్టి ఆ వెంటనే లాగేసుకోవడం ఏంటి? కర్ణాటకలో అంగన్‌వాడీ సిబ్బంది నిర్వాకం.. వర్కర్‌, హెల్పర్‌ సస్పెండ్‌ (వీడియోతో)

Rudra

కర్ణాటకలో అంగన్వాడీ సిబ్బంది తమ కక్కుర్తి బుద్దిని చూయించారు. కప్పాల్‌ జిల్లా కారంటాగి తాలూకా గుందుర్‌ గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రంలో సిబ్బంది పిల్లల పట్ల అత్యంత అమానుషంగా వ్యవహరించారు.

Andhra Pradesh: అల్లుడి కోసం 100 వంటకాలు.. తొలిసారి ఇంటికి వచ్చిన అల్లుడికి అదిరే వంటకాలు, ఆంధ్ర అత్తకు జేజేలు పలుకుతున్న నెటిజన్లు!

Arun Charagonda

తొలిసారి ఇంటికి వచ్చిన అల్లుడికి అదిరే సర్‌ప్రైజ్ ఇచ్చారు ఓ అత్త. ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం తామరాడ గ్రామానికి చెందిన రత్నకుమారికి కాకినాడకు చెందిన రవితేజకు గతేడాది సెప్టెంబర్లో వివాహం జరిగింది. వివాహం అయి ఆషాడం మాసం ముగిసిన తర్వాత తొలిసారిగా అత్తారింటికి వచ్చిన అల్లుడికి అత్తమామలు ఏకంగా 100 రకాల పిండివంటలతో భోజన ఏర్పాట్లు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Telangana Cyber Police: ముంబై సైబర్ క్రైం పోలీస్‌ పేరుతో సైబర్ మోసం, 13 రాష్ట్రాల్లో నేరాలు, మోసగాడిని వలవేసి పట్టుకున్న తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో

Arun Charagonda

ముంబై సైబర్ క్రైం పోలీస్‌గా నటిస్తున్న సైబర్ నేరగాన్ని వల వేసి పట్టుకుంది తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో. విశాఖపట్నంకు చెంది 39 ఏళ్ల షేక్ ఖలీల్ ముంబై సైబర్ క్రైం పోలీస్ అధికారిగా నటిస్తూ తప్పుడు ఆరోపణలతో డబ్బులు దోచుకోవడం ప్రవృత్తిగా మార్చుకున్నాడు.

Natwar Singh Passes Away: మాజీ విదేశాంగ మంత్రి నట్వర్ సింగ్ కన్నుమూత.. వృద్ధాప్య సమస్యలతో హాస్పిటల్‌ లో తుదిశ్వాస

Rudra

గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న మాజీ విదేశాంగ శాఖ మంత్రి, కాంగ్రెస్ నేత కే నట్వర్ సింగ్ (95) శనివారం రాత్రి కన్నుమూశారు.

Advertisement

Robbers Attack On Narsapur Express:నర్సాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌పై దొంగల రాళ్లదాడి, రైల్వే బోగిల్లోకి వెళ్లేందుకు ప్రయత్నం, లాక్ చేసి ఉండటంతో వెనుదిరిగిన దొంగలు..వీడియో

Arun Charagonda

ఆంధ్రప్రదేశ్‌ పల్నాడు నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీకి ప్రయత్నించారు దొంగలు. నర్సాపూర్ రైలుపై రాళ్లు రువ్వి, B1, S11, S12 కోచ్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. కోచ్‌ల డోర్లు లాక్ చేసి ఉండటంతో లోపలికి వెళ్లలేకపోయారు. దీనిపై దర్యాప్తు చేపట్టారు రైల్వే పోలీసులు.

Attack On YSRCP Leader: అన్నమయ్య జిల్లాలో దారుణం, వైసీపీ నాయకుడిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి, తీవ్ర గాయాలు, ఆస్పత్రికి తరలింపు

Arun Charagonda

ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లాలో దారుణం జరిగింది. వైఎస్సార్సీపీ నాయకుడిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. తంబళ్లపల్లి నియోజకవర్గం పులికల్లు గ్రామ పంచాయతీకి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు లక్ష్మీ నారాయణ పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు.

Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కుటుంబ సమేతంగా దర్శనం..వీడియో

Arun Charagonda

తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఇక అంతకముందు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న భట్టికి అనుకోకుండా తారసపడ్డారు మోహన్ బాబు. వీరిద్దరి కాసేపు ముచ్చటించుకున్నారు.

Nalgonda: నల్లగొండలో త్రాగు నీటిలో వానపాములు, ఈ నీటిని ఎలా త్రాగాలని స్థానికుల ఆందోళన, ఎనమిది నెలలుగా వాటర్ ట్యాంక్‌ను శుభ్రం చేయలేదని మండిపాటు

Arun Charagonda

నల్లగొండలో త్రాగు నీటిలో వానపాములు కలకలం రేపాయి. నల్లగొండ - నకిరేకల్ నియోజకవర్గంలోని కట్టంగూరు మండల కేంద్రంలో త్రాగు నీటిలో వానపాములు వచ్చాయి. వాటర్ ట్యాంకును ఎనిమిది నెలలుగా శుభ్రం చేయలేదని.. ఈ నీరు మేము తాగేదెలా అని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది

Advertisement
Advertisement