Bandi Sanjay on 2028 Telangana Elections: తెలంగాణలో 2028లో ఎగిరేది బీజేపీ జెండానే, బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

అతి తక్కువ కాలంలో కాంగ్రెస్‌పై తీవ్ర వ్యతిరేకత నెలకొందని, రాష్ట్రంలో సీఎం హామీలకు విలువ లేకుండా పోయిందని మండిపడ్డారు. యూఎస్‌కు చెందిన ‘ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ’ ఎన్‌ఆర్‌ఐ నేతలతో కేంద్ర మంత్రి బండి సంజయ్‌ వర్చువల్ గా సమావేశమయ్యారు.

BJP Leader, minister bandi sanjay sensational comments congress and brs merge (X)

Hyd, Nov 4: తెలంగాణలో జరగబోయే 2028 ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి (Bandi Sanjay on 2028 Telangana Elections) రావడం ఖాయమని బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అతి తక్కువ కాలంలో కాంగ్రెస్‌పై తీవ్ర వ్యతిరేకత నెలకొందని, రాష్ట్రంలో సీఎం హామీలకు విలువ లేకుండా పోయిందని మండిపడ్డారు. యూఎస్‌కు చెందిన ‘ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ’ ఎన్‌ఆర్‌ఐ నేతలతో కేంద్ర మంత్రి బండి సంజయ్‌ వర్చువల్ గా సమావేశమయ్యారు.

తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బస్సుయాత్ర, 36 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాగనున్న బస్సు యాత్ర, ప్రభుత్వ పనితీరు తెలుసుకోనున్న భట్టి

దక్షిణాదికి అన్యాయం పేరుతో కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేస్తోందని, మీడియా ప్రచారం తప్ప ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదన్నారు. ఇక బీఆర్ఎస్ పనైపోయిందని, ఆ పార్టీలో క్యాడర్‌ లేరన్నారు. ఆ పార్టీలో కొంతమంది నేతలు అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఆదాయం కోసం కాకుండా ఆలయాల్లో ప్రజలకు సేవలందిస్తామని, హిందూ ధర్మం, ప్రజల ఆలోచనలకు అనుగుణంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. కనీసం ఐదుగురు విదేశీయులను భారత్‌లో పర్యటించేలా కృషి చేయాలని ఎన్నారైలకు ఆయన సూచించారు. దేశాభివృద్ధి కోసం తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని కోరారు.

రాష్ట్రంలో మాజీ సర్పంచ్‌ల అరెస్టు దుర్మార్గమని, సర్పంచ్‌లు అప్పుల పాలవడానికి బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలే కారణమని మండిపడ్డారు. అధికారంలోకి రాగానే పెండింగ్ బిల్లులన్నీ చెల్లిస్తామని చెప్పిన కాంగ్రెస్‌.. మాట తప్పిందని విమర్శించారు. ఏడాది కాలంగా పెండింగ్‌లో ఉన్న బిల్లులను ఇవ్వాలని విన్నవించినా చెల్లించకపోవడం సిగ్గుచేటన్నారు.అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

Telangana: సివిల్ వ్యవహారంలో తలదూర్చిన ఎస్‌ఐ బొరగాల అశోక్.. బాధితుడిని బండబూతులు తిట్టిన వైనం, ఎస్ఐ అశోక్‌పై ఎంక్వైరీ చేయాలని కమిషనర్ ఆదేశం

Union Budget 2025: ఆకట్టుకుంటున్న నిర్మలమ్మ 'బడ్జెట్ సైకత శిల్పం'.. పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశ పెట్టబోతున్న నేపథ్యంలో పూరీ తీరంలో సైకత శిల్పాన్ని రూపొందించిన సుదర్శన్‌ పట్నాయక్‌

Delhi Election 2025: ఢిల్లీ ఎన్నికలకు ముందే కేజ్రీవాల్‌కు షాక్, ఏడుగురు ఆప్ ఎమ్మెల్యేలు రాజీనామా, రానున్న ఎన్నికల్లో పార్టీ టికెట్లు ఇవ్వకపోవడంతో గుడ్ బై

MLC Kavitha: నీళ్ల మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం నీచ రాజకీయం.. ఎమ్మెల్సీ కవిత ఫైర్, తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం, మేడిగడ్డ బ్యారేజీ మేరునగధీరుడిలా నిలబడిందని కామెంట్

Share Now