Dearness Allowance Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌ న్యూస్, డీఏ 4శాతం పెంచుతూ కేబినెట్ నిర్ణయం, ఏడో వేతన సంఘం సిఫార్సుల ఆధారంగా నిర్ణయం

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు (Central Govt Employees) కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉద్యోగులందరికీ నాలుగు శాతం కరవు భత్యం (DA) పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం జరిగిన భేటీలో కేబినెట్‌ (Cabinet) ఆమోదం తెలిపింది. దీంతో ప్రస్తుతం 38 శాతంగా ఉన్న డీఏ 42 శాతానికి పెరగనుంది.

Indian Rupee (photo Credit- ANI)

New Delhi, March 24: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు (Central Govt Employees) కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉద్యోగులందరికీ నాలుగు శాతం కరవు భత్యం (DA) పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం జరిగిన భేటీలో కేబినెట్‌ (Cabinet) ఆమోదం తెలిపింది. దీంతో ప్రస్తుతం 38 శాతంగా ఉన్న డీఏ 42 శాతానికి పెరగనుంది. ఈ పెంపుతో కేంద్ర ఖజానాపై అదనంగా రూ. 12,815 కోట్లు భారం పడుతుందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ (Anurag Thakur) తెలిపారు. జనవరి 1, 2023 నుంచి ఈ పెంపు వర్తిస్తుందన్నారు. పెరుగుతున్న ధరల నుంచి కేంద్రం ప్రభుత్వ పరిధిలోని ఉద్యోగులకు ఊరటగా కేంద్రం డీఏను ఇస్తుంది. వినియోగదారుల ధర సూచీ ఆధారంగా కేంద్రం డీఏను లెక్కిస్తుంది.

తాజా నిర్ణయంతో కేంద్రం పరిధిలోని 47.58 లక్షల మంది ఉద్యోగులకు, 69.76 లక్షల మంది పెన్షర్లకు (Pensioners) లబ్ధి చేకూరనుంది. ఏడో వేతన సంఘం సిఫార్సుల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం డీఏ పెంచిన నేపథ్యంలో రాష్ట్రాలు సైతం తమ ఉద్యోగులకు ఆ మేర డీఏ పెంచే అవకాశం ఉంది. ఏటా రెండుసార్లు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏను కేంద్రం సవరిస్తూ ఉంటుంది.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

PM Modi On Womens Day: నారీ శక్తికి వందనం... మహిళా దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ స్పెషల్ ట్వీట్, మహిళల సాధికారత కోసం కృషిచేస్తామని వెల్లడి

Good News To TGSRTC Employees: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. 2.5 శాతం డీఏ ప్రకటన.. డీఏ ప్రకటనతో ప్రతి నెల ఆర్టీసీపై రూ.3.6 కోట్లు అదనపు భారం.. పూర్తి వివరాలు ఇవిగో..!

PM Modi: తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుపై ప్రధానమంత్రి మోదీ ట్వీట్.. శ్రమించిన కార్యకర్తలను చూసి గర్వపడుతున్నా అని ట్వీట్

IT Employees Suffer Overweight: హైదరాబాద్ భారతదేశానికి మధుమేహ రాజధానిగా మారుతోంది, AIG హాస్పిటల్ ఛైర్మెన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు, వీడియో ఇదిగో

Advertisement
Advertisement
Share Now
Advertisement