CM Atishi Comments on Amith Shah: కేంద్ర హోంమంత్రి అమిత్ షా పై సీరియ‌స్ కామెంట్స్ చేసిన ఢిల్లీ సీఎం అతిషి, గ్యాంగ్ స్ట‌ర్ల‌కు అడ్డాగా మారింద‌ని ఆగ్ర‌హం

ఢిల్లీ నగరం గ్యాంగ్‌స్టర్లకు అడ్డాగా మారిందని ఢిల్లీ సీఎం అతిశీ (Delhi CM Atishi) అన్నారు. ఢిల్లీ లా అండ్‌ ఆర్డర్‌ను చేతిలో పెట్టుకుని కేంద్రం ఏం చేస్తోందని ఆమె మండిపడ్డారు. ఇటీవల ఢిల్లీలో హత్యకు గురైన యువకుడి కుటుంబాన్ని పరామర్శించిన అతిశీ.. కేంద్ర మంత్రి అమిత్‌ షాపై (Amith Shah) తీవ్ర విమర్శలు గుప్పించారు.

Atishi (Photo Credits: X/@AtishiAAP)

New Delhi, NOV 20: ఢిల్లీ నగరం గ్యాంగ్‌స్టర్లకు అడ్డాగా మారిందని ఢిల్లీ సీఎం అతిశీ (Delhi CM Atishi) అన్నారు. ఢిల్లీ లా అండ్‌ ఆర్డర్‌ను చేతిలో పెట్టుకుని కేంద్రం ఏం చేస్తోందని ఆమె మండిపడ్డారు. ఇటీవల ఢిల్లీలో హత్యకు గురైన యువకుడి కుటుంబాన్ని పరామర్శించిన అతిశీ.. కేంద్ర మంత్రి అమిత్‌ షాపై (Amith Shah) తీవ్ర విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయన్నారు. ఇటీవల సుందర్‌నగరిలో ఇద్దరు యువకులు ఓ మహిళను వేధిస్తుండగా ఆమె కుటుంబీకులు, బంధువులు మందలించి పంపించారని, అది మనుసులో పెట్టుకున్న ఆ ఇద్దరు యువకులు తిరిగి కత్తులతో వచ్చి దాడికి పాల్పడ్డారని, ఆ దాడిలో 28 ఏళ్ల వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడని అతిశీ వెల్లడించారు. ఇవాళ మృతుడి కుటుంబాన్ని కలిసిన ఆమె రూ.10 లక్షల పరిహారం ప్రకటించారు.

Maharashtra Exit Poll Result 2024: ఇండియా కూటమికి షాకిచ్చిన ఎగ్జిట్ పోల్స్, మహారాష్ట్రలో అతి పెద్ద పార్టీగా అవతరించనున్న బీజేపీ కూటమి, పూర్తి ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఇవిగో..  

ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె.. ఢిల్లీ గ్యాంగ్‌స్టర్లకు రాజధానిగా మారిందని, నేరస్థులు, దోపిడీదారులు, గూండాలకు భయం లేకుండా పోయిందని అన్నారు. నేరస్థులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోకపోవడంతో నేరాలు పెరుగుతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా నుంచి తాను ఓ విషయం తెలుసుకోవాలని అనుకుంటున్నానని, ఢిల్లీ శాంతిభద్రతల బాధ్యత ఆయన చేతుల్లో పెట్టుకుని ఏం చేస్తున్నారని అతిశీ ప్రశ్నించారు. ఆయనకు ఎన్నికల ప్రచారం మీద ఉన్న ధ్యాస ఢిల్లీలో శాంతిభద్రతలపై లేదని విమర్శించారు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

CM Revanth Reddy: ఆత్మగౌరవంలోనే కాదు.. త్యాగంలోనూ పద్మశాలీలు ముందుంటారు, సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు, ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెడుతున్నట్లు ప్రకటన

Chandrababu Launches Shakti Teams: శక్తి టీమ్స్‌ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు... మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలకు శ్రీకారం, ప్రతీ గ్రామంలో అరకు కాఫీ ఔట్ లెట్స్‌ ఉండాలని వెల్లడి

Telangana Railway Projects: కాజిపేట రైల్వే డివిజన్ ఏర్పాటు.. కొత్త రైల్వే లైన్లను మంజూరు చేయండి, కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసిన మంత్రి కోమటిరెడ్డి, ఎంపీలు

Telangana Assembly Sessions: 12 నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. 18న లేదా 19న రాష్ట్ర బడ్జెట్, ఈసారైనా అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ వచ్చేనా!

Advertisement
Advertisement
Share Now
Advertisement