Delhi High Court: కరోనా రిపోర్ట్ లేకున్నా లక్షణాలుంటే ఆసుపత్రుల్లో చేర్చుకోవాల్సిందే, ఆసుపత్రులకు ఆదేశాలు ఇవ్వాలని ఆప్ సర్కారుకు సూచించిన ఢిల్లీ హైకోర్టు

కరోనా పాజిటివ్‌ రిపోర్టు రాకున్నా కోవిడ్‌ లక్షణాలుంటే ఆసుపత్రుల్లో చేర్చేలా ఆదేశాలు ఇవ్వాలని ఆప్‌ ప్రభుత్వానికి ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) సూచించింది. ప్రభుత్వ ఆదేశాలను ఆసుపత్రులు తూచ తప్పకుండా పాటించాలని ఈ సందర్భంగా స్పష్టం చేసింది.

Delhi High Court (Photo Credits: IANS)

New Delhi, April 27: కరోనా పాజిటివ్‌ రిపోర్టు రాకున్నా కోవిడ్‌ లక్షణాలుంటే ఆసుపత్రుల్లో చేర్చేలా ఆదేశాలు ఇవ్వాలని ఆప్‌ ప్రభుత్వానికి ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) సూచించింది. ప్రభుత్వ ఆదేశాలను ఆసుపత్రులు తూచ తప్పకుండా పాటించాలని ఈ సందర్భంగా స్పష్టం చేసింది.

ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యం విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీఎన్‌ పాటిల్‌ , జస్టిస్‌ జస్మీత్‌ సింగ్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు సోమవారం ఆదేశాలు ఇచ్చింది. మినిమిం ఆక్సిజన్‌ లెవెల్‌ కన్నా తక్కువ ఉన్న రోగులకు లబ్ధి చేకూరేలా తగిన చర్యలు తీసుకోని, ఆ ఆదేశాలు అందరికీ చేరేలా చూడాలని స్పష్టం చేసింది.

కాగా ఏప్రిల్‌ 23 నుంచే ఈ ఆదేశాలు అమలులో ఉన్నాయని ఢిల్లీ ప్రభుత్వం తరఫు న్యాయవాది అనూజ్‌ అగర్వాల్‌ కోర్టుకు తెలిపారు. ఇతరత్రా ఆదేశాలు జారీ అవసరం లేదని ధర్మాసనం పేర్కొంది. కోవిడ్‌–19 పరీక్షలు దేశరాజధానిలో నిర్వహించడం లేదని కేంద్రం తరఫు హాజరైన అదనపు సొలిసిటర్‌ జనరల్‌ చేతన్‌శర్మ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

అందరికీ ఉచితంగా క‌రోనా వ్యాక్సిన్‌, 18 ఏళ్లు దాటిన వారందరికీ ఫ్రీగా ఇస్తామని ప్రకటించిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, 1.34 కోట్ల డోసుల కొనుగోలుకు ప్రభుత్వం అమోదం

కరోనా కేసులు తక్కువగా ఉన్న సమయంలో ఎక్కువ పరీక్షలు చేశారని, ఎక్కువ కేసులు ఉన్నప్పుడు తక్కువ పరీక్షలు చేస్తున్నారని వివరించారు. కేసుల సంఖ్యను దృష్టిలో ఉంచుకొని పరీక్ష కేంద్రాలు మరిన్ని పెంచాలని, మౌలికసదుపాయాలు పెంచాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని ధర్మాసనం కోరింది.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

Nalgonda Fake Journalists: నల్గొండ జిల్లాలో నకిలీ జర్నలిస్టుల హల్చల్.. ఓ సీఐని బెదిరించి రూ. 5 లక్షలు డిమాండ్, పలువురు పోలీసులను బ్లాక్‌మెయిల్, వివరాలివే

Union Budget 2025 Highlights: రూ. 50,65,345 కోట్ల కేంద్ర బడ్జెట్ సమగ్ర స్వరూపం ఇదే, రక్షణ రంగానికే ఎక్కువ ప్రాధాన్యం, రంగాల వారీగా బ‌డ్జెట్ కేటాయింపులు, నిర్మలమ్మ బడ్జెట్‌ ప్రసంగం హైలెట్స్ మీకోసం..

Supreme Court: నేరం రుజువు కావాలంటే నిందితుడు బహిరంగంగా దూషించాలి.. నాలుగు గోడల మధ్య జరిగితే కేసు నిలబడదు.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

Delhi Election 2025: ఢిల్లీ ఎన్నికలకు ముందే కేజ్రీవాల్‌కు షాక్, ఏడుగురు ఆప్ ఎమ్మెల్యేలు రాజీనామా, రానున్న ఎన్నికల్లో పార్టీ టికెట్లు ఇవ్వకపోవడంతో గుడ్ బై

Share Now