Bypolls in 13 Assembly Seats in 7 States: మళ్లీ మోగిన ఎన్నికల నగారా, ఏడు రాష్ట్రాల్లో 13 అసెంబ్లీ సీట్లకు జులై 10న ఉప ఎన్నికలు, జులై 13న ఓట్ల లెక్కింపు

దేశంలో మళ్లీ ఎన్నికల నగారా మోగింది. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన కొద్ది రోజులకే మళ్లీ ఎలక్షన్స్‌కు ఎన్నికల సంఘం (Election Commission) సిద్ధమైంది. మొత్తం ఏడు రాష్ట్రాల్లో 13 అసెంబ్లీ నియోజకవర్గాలకు జులై 10న ఉప ఎన్నికలు (Bypolls) నిర్వహించనున్నట్లు ప్రకటించింది.

Bypolls in 13 Assembly Seats in 7 States: మళ్లీ మోగిన ఎన్నికల నగారా, ఏడు రాష్ట్రాల్లో 13 అసెంబ్లీ సీట్లకు జులై 10న ఉప ఎన్నికలు, జులై 13న ఓట్ల లెక్కింపు
Election Commission (photo-ANI)

దేశంలో మళ్లీ ఎన్నికల నగారా మోగింది. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన కొద్ది రోజులకే మళ్లీ ఎలక్షన్స్‌కు ఎన్నికల సంఘం (Election Commission) సిద్ధమైంది. మొత్తం ఏడు రాష్ట్రాల్లో 13 అసెంబ్లీ నియోజకవర్గాలకు జులై 10న ఉప ఎన్నికలు (Bypolls) నిర్వహించనున్నట్లు ప్రకటించింది. 10చోట్ల ఎమ్మెల్యేల రాజీనామాలు, మూడుచోట్ల ప్రజాప్రతినిధుల మృతితో బైపోల్స్‌ అనివార్యమయ్యాయి. జులై 15 లోపు ఈ ప్రక్రియ పూర్తి చేయాల్సిఉందని ఈసీ వెల్లడించింది.  ముచ్చట‌గా మూడోసారి ప్ర‌ధానిగా ప్ర‌మాణ‌స్వీకారం చేసిన న‌రేంద్ర మోదీ, కేబినెట్ లోని మంత్రులు వీళ్లే (వీడియో ఇదుగోండి)

రుపౌలీ (బిహార్‌), రాయ్‌గంజ్‌, రాణాఘాట్‌ దక్షిణ్‌, బాగ్దా, మానిక్‌తలా (పశ్చిమ బెంగాల్‌), విక్రవాండీ (తమిళనాడు), అమర్‌వాడా (మధ్యప్రదేశ్‌), బద్రీనాథ్‌, మంగ్లౌర్‌ (ఉత్తరాఖండ్‌), జలంధర్‌ వెస్ట్‌ (పంజాబ్‌), డెహ్రా, హమీర్‌పుర్‌, నాలాగఢ్‌ (హిమాచల్‌ ప్రదేశ్‌) అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు. మానిక్‌తాలా, విక్రవాండీ, మంగ్లౌర్‌ స్థానాల్లో ఎమ్మెల్యేలు మృతిచెందగా.. మిగతాచోట్ల రాజీనామా చేశారు.

షెడ్యూల్‌ వివరాలిలు ఇవిగో..

నోటిఫికేషన్‌ విడుదల: జూన్‌ 14

నామినేషన్లకు చివరి తేదీ: జూన్‌ 21

నామినేషన్ల పరిశీలన: జూన్‌ 24

ఉపసంహరణ గడువు: జూన్‌ 26

పోలింగ్‌ తేదీ: జులై 10

ఓట్ల లెక్కింపు: జులై 13

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)



సంబంధిత వార్తలు

Andhra Pradesh Assembly Session 2025: స్వర్ణాంధ్ర 2047 కోసం రోడ్ మ్యాప్, 2027 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి, ఏపీ ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగం, అనంతరం సభ రేపటికి వాయిదా

Andhra Pradesh Assembly Session 2025: అసెంబ్లీ నుంచి వైఎస్సార్‌సీపీ సభ్యుల వాకౌట్‌, ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా అసెంబ్లీలో మాట్లాడలేం, ప్రజా సమస్యలపై క్షేత్ర స్థాయిలో పోరాటం చేస్తామని వెల్లడి

Fire Accident In Kukatpally: కూకట్‌ పల్లిలో భారీ అగ్నిప్రమాదం.. ప్లాస్టిక్ గ్లాసులు, పేపర్ ప్లేట్లు తయారు చేసే కంపెనీలో ప్రమాదవశాత్తు మంటలు (వీడియో)

Bus Accidents In Telugu States: తెలుగు రాష్ట్రాల్లో ఆందోళన కలిగిస్తున్న ప్రైవేటు ట్రావెల్ బస్సు ప్రమాదాలు.. మహబూబ్ నగర్ జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు.. తిరుపతిలోని సూళ్లురు పేట హైవేపై ట్రావెల్స్ బస్సు బోల్తా

Share Us