Mamata calls Delhi meet: విపక్షాలను ఏకం చేస్తున్న మమతా బెనర్జీ, 22 మంది నేతలకు లేఖ, రాష్ట్రపతి ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్ధిపై చర్చించే అవకాశం, సోనియా గాంధీ, సీఎం కేసీఆర్ సహా 19 పార్టీలకు ఆహ్వానం

రాష్ట్రపతి ఎన్నికలకు (Prez polls) షెడ్యూల్‌ విడుదలైన వేళ దేశ రాజకీయాల్లో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ (Mamata Benarjee).. కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో అధికార ఎన్​డీఏ కూటమి అభ్యర్థిని ఓడించేందుకు విపక్షాలతో సమావేశానికి రెడీ అయ్యారు. రాష్ట్రపతి ఎన్నికల కోసం మమతా బెనర్జీ భవిష్యత్తు కార్యాచరణకు ప్లాన్‌ చేశారు

West Bengal CM Mamata Banerjee. (Photo Credit: Facebook/Mamata Banerjee)

kolkata, June 12: రాష్ట్రపతి ఎన్నికలకు (Prez polls) షెడ్యూల్‌ విడుదలైన వేళ దేశ రాజకీయాల్లో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ (Mamata Benarjee).. కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో అధికార ఎన్​డీఏ కూటమి అభ్యర్థిని ఓడించేందుకు విపక్షాలతో సమావేశానికి రెడీ అయ్యారు. రాష్ట్రపతి ఎన్నికల కోసం మమతా బెనర్జీ భవిష్యత్తు కార్యాచరణకు ప్లాన్‌ చేశారు. ఈ క్రమంలోనే మమత.. దేశంలోని విపక్ష నేతలు, ముఖ్యమంత్రులకు లేఖ రాశారు. రాష్ట్రపతి ఎన్నికలకు సంయుక్త వ్యూహాన్ని రూపొందించేందుకు జూన్​ 15న ఢిల్లీలో నిర్వహించే సమావేశానికి వారిని హాజరుకావాలని మమతా బెనర్జీ లేఖలో కోరారు.

Anil Firojiya: కిలో బరువు తగ్గితే వెయ్యికోట్లు, ఉజ్జయిని ఎంపీకి బంపర్ ఆఫర్ ఇచ్చిన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, నియోజకవర్గం కోసం చమటోడ్చుతున్న అనిల్ ఫిరోజియా 

కాగా, జూన్​ 15న మధ్యాహ్నం 3గంటలకు ఢిల్లీలోని కాన్​స్టిట్యూషన్​ క్లబ్​లో మమతా బెనర్జీ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. బలమైన అభ్యర్థిని బరిలో నిలపాలనే లక్ష్యంతోనే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టు స్పష్టం చేశారు. ఇక, 22 మంది విపక్ష నేతలు, సీఎంలకు, కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీకి (Sonia Gandhi) మమత లేఖ రాశారు. వారిలో తెలంగాణ సీఎం కేసీఆర్‌ (CM KCR), ఎంకే స్టాలిన్​, ఉద్ధవ్​ ఠాక్రే(Uddav Thakrey), అరవింద్​ కేజ్రీవాల్​, నవీన్​ పట్నాయక్​, పినరయి విజయన్​, హేమంత్​ సొరెన్​, భగవంత్​ మాన్​లు ఉన్నారు.

Karnataka Shocker: బెంగుళూరులో దారుణం, పెళ్లికి ఒప్పుకోలేదని వివాహితపై యాసిడ్ పోసిన యువకుడు, కంటికి తీవ్ర గాయం  

8 రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌కు స‌హా 22 మంది జాతీయ నేత‌ల‌కు మ‌మ‌త లేఖ రాశారు. రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల దృష్ట్యా విప‌క్షాల‌ను బెంగాల్ సీఎం కూడ‌గ‌డుతున్నారు. రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌లో బ‌ల‌మైన ప్ర‌త్య‌ర్థిని బ‌రిలో నిలిపేందుకు మ‌మ‌త తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. దీంతో ఈ నెల 15న ఢిల్లీలో నిర్వ‌హించే భేటీకి 22 మంది నేత‌ల‌కు ఆహ్వానం పంపారు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..

BRSLP Meeting Update: 11న బీఆర్ఎస్‌ఎల్పీ సమావేశం.. మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన శాసనసభాపక్షం సమావేశం, అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ

IFS Officer Dies by Suicide: డిప్రెషన్‌లోకి వెళ్లిన విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారి, నాలుగో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య, దేశరాజధానిలో ఘటన

Revanth Reddy Delhi Tour: ఢిల్లీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులపై అధిష్టానంతో చర్చ,ఇండియా టుడే కాంక్లేవ్‌లో పాల్గొననున్న రేవంత్

Advertisement
Advertisement
Share Now
Advertisement