Kapurthala Rail Coach Factory: దారుణంగా విఫలమైన కపుర్తలా రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ, టార్గెట్ 32 వందేభారత్ ట్రైన్లు- రిజల్ట్ సున్నా

2022-23 సంవత్సరానికి సంబంధించి 32 వందేభారత్ రైళ్లను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న కపుర్తలా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ దారుణంగా విఫలమైంది. నిర్దేశిత సమయం పూర్తైనప్పటికీ ఒక్కటంటే ఒక్క వందేభారత్ రైలును కూడా ఉత్పత్తి చేయలేకపోయింది. అయితే ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ తమకుఅందడంలో ఆలస్యం జరిగిందని అందుకే ఒక్క రైలును కూడా ఉత్పత్తి చేయలేకపోయినట్లు కోచ్ ఫ్యాక్టరీ సంజాయిషీ ఇచ్చుకుంది.

Vande Bharat Express (Photo-PTI)

Kapurthala, May 31: 2022-23 సంవత్సరానికి సంబంధించి 32 వందేభారత్ రైళ్లను (Vande Bharat Trains) ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న కపుర్తలా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ (Kapurthala Rail Coach Factory) దారుణంగా విఫలమైంది.  నిర్దేశిత సమయం పూర్తైనప్పటికీ ఒక్కటంటే ఒక్క వందేభారత్ రైలును కూడా ఉత్పత్తి చేయలేకపోయింది. అయితే ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ తమకు అందడంలో ఆలస్యం జరిగిందని అందుకే ఒక్క రైలును కూడా ఉత్పత్తి చేయలేకపోయినట్లు కోచ్ ఫ్యాక్టరీ సంజాయిషీ ఇచ్చుకుంది. తాజాగా విడుదలైన డాక్యూమెంట్లలో ఈ విషయం వెల్లడైంది. వాస్తవానికి 2024 ఆగస్టు నాటికి 74 వందేభారత్ రైళ్లను నడిపేందుకు ప్రభుత్వం లక్ష్యం పెట్టుకుంది.  కానీ కపుర్తలా కోచ్ ఫ్యాక్టరీ (Kapurthala Rail Coach Factory) ఆలస్యం కారణంగా అది నెరవేరేలా లేదని అధికారులు అంటున్నారు.

ఒక్క వందేభారత్ మాత్రమే కాదు, ఇతర రైల్వే కోచుల విషయంలో కూడా కపుర్తలా ఫ్యాక్టరీ ఇదే తీరున ఉన్నట్లు రిపోర్టులు చెబుతున్నాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఈ ఫ్యాక్టరీ ఉత్పత్తి భారీగానే పడిపోయినట్లు చెబుతున్నారు. 1,885 కోచులు తయారు చేయాలని లక్ష్యం ఉండగా కేవలం 1,478 కోచులను మాత్రమే ఉత్పత్తి చేశారు.

Free Bus Travel For Women in Karnataka: మహిళలందరికి ప్రభుత్వ బస్సుల్లో ఇకపై ఉచిత ప్రయాణం, అధికారికంగా వెల్లడించిన కర్ణాటక రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి 

ఇక 256 త్రీహెచ్‭పీలను తయారు చేయాలని లక్ష్యం ఉండగా కేవలం 153 త్రీహెచ్‭పీలను మాత్రమే ఉత్పత్తి చేశారు.  అలాగే 1,520 ఎల్‭హెచ్‭బీలకు గాను 1,325 ఎల్‭హెచ్‭బీలను మాత్రమే ఉత్పత్తి చేశారు. అయితే వందేభారత్ రైళ్ల తయారీ గురించి ఒక అధికారి మాట్లాడుతూ ఈ ఫ్యాక్టరీలో ఆ తయారీ 2024 సెప్టెంబరులో ప్రారంభమవుతుందని అన్నారు. నిజానికి ఈ యేడాది 64 వందేభారత్ రైళ్లను కపుర్తలా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వాలని మొదట ప్లాన్ చేశారు. కానీ ఆ పనే ఇప్పటికి పట్టాలు ఎక్కలేదు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Telangana Railway Projects: కాజిపేట రైల్వే డివిజన్ ఏర్పాటు.. కొత్త రైల్వే లైన్లను మంజూరు చేయండి, కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసిన మంత్రి కోమటిరెడ్డి, ఎంపీలు

SC On BRS MLAs' Case: రోగి చనిపోతే ఆపరేషన్ విజయవంతమా, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు విచారణలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు, తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ

Rules Change In Railways: వెయిటింగ్‌ లిస్ట్‌ ప్రయాణికులకు జనరల్‌ బోగీల్లోనే ప్రయాణించాలి.. ఏసీ, స్లీపర్‌ బోగీల్లో ప్రయాణిస్తే జరిమానా.. ఈ నెల 1 నుంచి అమల్లోకి వచ్చిన రైల్వే కొత్త నిబంధనలు

Bumper Offer On Tata Electric Cars: టాటా ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌పై బంపర్ ఆఫర్‌, రాబోయే 45 రోజుల్లో కారు కొంటే ఏకంగా రూ. 2 లక్షల వరకు ప్రయోజనాలు

Advertisement
Advertisement
Share Now
Advertisement