Bengaluru Rains: బెంగుళూరును ముంచెత్తిన భారీ వర్షం, నీట మునిగిన పలు ప్రాంతాలు, అండర్ పాస్‌లో నీరు నిండిపోవడంతో చిక్కుకుపోయిన కార్లు

బెంగళూరులో ఆదివారం భారీ వర్షాలు, వడగళ్ల వానలు కురిసాయి, దీనితో నగరంలోని పలు ప్రాంతాల్లో నీట మునిగాయి. వర్షం కారణంగా నగరంలోని వివిధ ప్రాంతాల్లో సాధారణ కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది.పలు ప్రాంతాల్లో చెట్లు నేలకూలడంతో పాటు కేఆర్ సర్కిల్ పరిధిలోని అండర్‌పాస్‌ నీటితో నిండిపోయింది

Visual from Bengaluru. (Photo/ANI)

బెంగళూరులో ఆదివారం భారీ వర్షాలు, వడగళ్ల వానలు కురిసాయి, దీనితో నగరంలోని పలు ప్రాంతాల్లో నీట మునిగాయి. వర్షం కారణంగా నగరంలోని వివిధ ప్రాంతాల్లో సాధారణ కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది.పలు ప్రాంతాల్లో చెట్లు నేలకూలడంతో పాటు కేఆర్ సర్కిల్ పరిధిలోని అండర్‌పాస్‌ నీటితో నిండిపోయింది.అండర్‌పాస్‌లో చిక్కుకున్న వారిని సురక్షితంగా రక్షించి ఆసుపత్రికి తరలించారు.

రోడ్లపైకి వరద నీరు చేరింది. నగరంలోని కేఆర్‌ సర్కిల్‌లోని అండర్‌పాస్‌ వద్ద వర్షం నీటిలో కారు చిక్కుకుపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని.. కారులో ఉన్న వారిని రక్షించారు. కారు నీటిలో మునగడంతో అస్వస్థతకు గురైన భాను రేఖ (23) మృతి చెందింది. వరద నీటిలో చిక్కుకున్న సమయంలో కారులో ఏడుగురు వ్యక్తులు ఉన్నారు. మృతురాలిని ఏపీ విజయవాడకు చెందిన మహిళగా గుర్తించారు. భాను రేఖ బెంగళూరులో ఇన్ఫోసిస్‌లో పని చేస్తున్నది.

భారీ వర్షపు సూచన, రెండు రోజుల పాటు 12 జిల్లాలకు అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ, మరో వైపు ఎండలు కూడా మండిపోతాయని హెచ్చరిక

మధ్యాహ్నం 3 గంటల సమయంలో బెంగళూరులో భారీ కారు మేఘాలు కమ్మేయడంతో పాటు కుండపోతగా వర్షం కురవడంతో వాహనదారులు రోడ్లపైనే వాహనాలను నిలిపివేశారు. అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడిన నేపథ్యంలో బెంగళూరు సహా సలు పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. బెంగళూరు విధానసౌధ, ఆనంద్ రావు, మెజెస్టిక్, రేస్ కోర్స్, కేఆర్ సర్కిల్, టౌన్ హాల్, కార్పొరేషన్, మైసూర్ బ్యాంక్ సర్కిల్, జయనగర్, మల్లీశ్వర్ సహా పలు ప్రాంతాల్లో వర్షానికి భారీగా వరద నీరు చేరింది.

మల్లేశ్వర, కేఆర్‌సర్కిల్‌లో వడగళ్ల కురిశాయి. ఈదురు గాలులకు కేఆర్‌సర్కిల్‌, సర్‌ ఎం విశ్వేశ్వరయ్య యూనివర్సిటీ, ఆనంద్‌రావు సర్కిల్‌ వీవీ దాస్‌ హోటల్‌ ఎదుట చెట్లు నేలకూలాయి. హోటల్‌ వద్ద చెట్టు నేలకూలడంతో కారు నుజ్జునుజ్జు అయ్యింది. అయితే, ఆ సమయంలో కారులో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయ్యింది.

బెంగుళూరులో భారీ వర్షం, కారు మునిగిపోవడంతో ఏపీ మహిళ మృతి, నీటితో నిండిపోయిన కేఆర్‌ సర్కిల్‌ అండర్‌ పాస్‌

కుమార్ కృపా రోడ్డులోని చిత్రకళా పరిషత్ ఎదురుగా కారు, బైక్‌పై చెట్లకొమ్మలు విరిగిపడడంతో వాహనాలు దెబ్బతిన్నాయి. ఈ సమయంలో కారులో ప్రయాణిస్తున్న వారికి తీవ్రగాయాలయ్యాయి. కేఆర్‌సర్కిల్‌ వద్ద వర్షపు నీటిలో కారు చిక్కుకుపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని.. సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.

కేరళలో రుతుపవనాల ప్రారంభం ఈ ఏడాది ఆలస్యం అయ్యే అవకాశం ఉందని, జూన్ 1న అంచనా వేసిన సాధారణ తేదీ కంటే నాలుగు రోజుల తర్వాత జూన్ 4న వచ్చే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. నైరుతి రుతుపవనాలు సాధారణంగా 7 రోజుల ప్రామాణిక విచలనంతో జూన్ 1న కేరళలో ప్రారంభమవుతాయి.

భారత వాతావరణ శాఖ (IMD) 2005 నుండి కేరళపై రుతుపవనాల ప్రారంభ తేదీకి కార్యాచరణ సూచనలను జారీ చేస్తోంది. స్వదేశీ అభివృద్ధి చెందిన రాష్ట్రం- +- 4 రోజుల మోడల్ లోపం ఉన్న ఆర్ట్ స్టాటిస్టికల్ మోడల్ ప్రయోజనం కోసం ఉపయోగించబడుతుంది," IMD పేర్కొంది. గత సంవత్సరం, మే 27న IMD అంచనా వేసిన రెండు రోజుల తర్వాత, మే 29న కేరళపై రుతుపవనాలు సంభవించాయి. గత 18 ఏళ్లలో (2005-2022) కేరళలో రుతుపవనాల ప్రారంభ తేదీకి సంబంధించిన కార్యాచరణ అంచనాలు 2015లో తప్ప సరైనవని నిరూపించబడిందని IMD తెలిపింది.

మోడల్స్‌లో ఉపయోగించిన రుతుపవనాల ప్రారంభానికి సంబంధించిన ఆరు అంచనాలు: i) వాయువ్య భారతదేశంలో కనిష్ట ఉష్ణోగ్రతలు ii) దక్షిణ ద్వీపకల్పంలో రుతుపవనానికి ముందు వర్షపాతం iii) దక్షిణ చైనా సముద్రం మీదుగా అవుట్‌గోయింగ్ లాంగ్‌వేవ్ రేడియేషన్ (OLR) (iv) దిగువ ట్రోపోస్పిరిక్ జోనల్ ఆగ్నేయ హిందూ మహాసముద్రం మీదుగా గాలి (v) ఉపఉష్ణమండల NW పసిఫిక్ మహాసముద్రంపై సముద్ర మట్టం పీడనం (vi) ఈశాన్య హిందూ మహాసముద్రంపై ఎగువ ట్రోపోస్పిరిక్ జోనల్ గాలి" అని IMD విడుదల పేర్కొంది. రత ప్రధాన భూభాగంలో నైరుతి రుతుపవనాలు కేరళలో రుతుపవనాల ప్రారంభం ద్వారా గుర్తించబడతాయి మరియు ఇది వేడి మరియు పొడి కాలం నుండి వర్షాకాలం వరకు మారడాన్ని సూచించే ముఖ్యమైన సూచిక

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement