Horrifying Case: మహిళను చంపి ఆ డెడ్‌ బాడీతో కోరిక తీర్చుకున్న కామాంధుడు, నిందితుడిని అరెస్ట్ చేసిన కర్ణాటక పోలీసులు, సిసిటివి ఫుటేజీ ద్వారా కేసును చేధించిన పోలీసులు

కర్ణాటకలో అత్యంత హేయమైన, భయానకమైన ఘటన (Horrifying Case) చోటు చేసుకుంది. ఓ కామాంధుడు మహిళను చంపి ఆ శవం మీద పడి తన కామవాంఛను తీర్చుకున్నాడు. ఇది జరిగిన నెల తర్వాత ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కర్ణాటక పోలీసులు (Karnataka police) ఈ నేరానికి సంబంధించి 29 ఏళ్ల వ్యక్తిని అరెస్ట్ చేశారు.

Image used for representational purpose | (Photo Credits: PTI)

Bengaluru, Nov 23: కర్ణాటకలో అత్యంత హేయమైన, భయానకమైన ఘటన (Horrifying Case) చోటు చేసుకుంది. ఓ కామాంధుడు మహిళను చంపి ఆ శవం మీద పడి తన కామవాంఛను తీర్చుకున్నాడు. ఇది జరిగిన నెల తర్వాత ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కర్ణాటక పోలీసులు (Karnataka police) ఈ నేరానికి సంబంధించి 29 ఏళ్ల వ్యక్తిని అరెస్ట్ చేశారు. చిక్కబల్లాపూర్ లోని బట్లహల్లి గ్రామంలోని స్థానికుల నుండి ఆయన ఆచూకీ గురించి పోలీసులకు సమాచారం అందడంతో కె ఎన్ శంకరప్పను ఆదివారం పోలీసులు అరెస్టు చేశారు.

చిక్కబల్లాపూర్ ఎస్పీ జికె మిథున్ కుమార్ చెప్పిన వివరాల ప్రకారం..ఆంధ్రప్రదేశ్ లోని (Andhra Pradesh) ఇరావరపల్లికి చెందిన శంకరప్ప తన స్నేహితుడిని చూడటానికి మూడు నెలల క్రితం చిక్కబల్లపుర బట్లహల్లి తాలూకాకు వచ్చారు.అతనికి మద్యపానం అలవాటు బాగా ఉంది. ఈ నేపథ్యంలో బెంగుళూరులోని తన స్నేహితుడిని పరామర్శించడానికి వచ్చి ఉద్యోగం కోసం అతనిని అడిగాడు. కాగా మూడు నెలల క్రితం శంకరప్ప బట్లహల్లిలోని ఒక నివాస నిర్మాణ స్థలంలో నిర్మాణ కార్మికుడిగా పనిచేయడం ప్రారంభించాడు. అయితే, అతను పని చేయకుండా రోజంతా తోటల్లో తిరిగే వాడని పోలీసులు తెలిపారు.

ఇక చేతిలో డబ్బులు లేకపోవడంతో అక్టోబర్ 18 న శంకరప్ప తన స్నేహితుడి నుండి రూ .5 వేలు అప్పుగా తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఆ డబ్బులతో బాగా తాగి కోనపుర గ్రామంలో పడిపోయాడు. తెల్లారి లేచేసరికి అతని డబ్బు ముబైల్ ఎవరో ఎత్తుకెళ్లారు. వాటి కోసం పొలాల్లో పనిచేసే వారిని అడగడం ప్రారంబించాడు. ఈ నేపథ్యంలో ఓ పొలంలో ముగ్గురు మహిళలు పొలంలొ పనిచేస్తుండటం గమనించాడు. వారి దగ్గరకు వెళ్లి నా మొబైల్ పోయింది మీకైమైనా తెలుసా అంటూ వారితో మాటలు కలిపాడు.

పదేళ్లుగా 50 మందికి పైగా బాలికలపై అత్యాచారం, యూపీలో దారుణ ఘటన, నిందితుడిని అరెస్ట్ చేసిన సీబీఐ, పెద్ద ఎత్తున సీడీలు, వీడియోలు స్వాధీనం

వీరిలో ఇద్దరు మహిళలు కోనపుర్ నివాసి భార్యలు కాగా మరో మహిళ చనిపోయిన మహిళ యొక్క సవతి తల్లి కుమార్తె అని పోలీసులు తెలిపారు. తల్లి కూతురు చీకటి పడటంతో ఇంటికి వెళ్లగా మరో మహిళ పని పూర్తి కాకపోవడంతో అక్కడే ఉండిపోయింది. ఆమె శంకరప్పను వెళ్ళమని చెప్పింది. అయితే వర్షం ప్రారంభం అవడంతో ఆ మహిళ చెట్టు కిందకు వెళ్లింది. దీన్ని అదనుగా భావించిన శంకరప్ప ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఆ మహిళ ప్రతిఘటించడంతో అతను ధరించిన చొక్కాను చించి, దానితో గొంతు కోసి చంపాడని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని బస్సుల్లోకి లాగి ఆమెపై అత్యాచారం చేశాడు.

బాధితురాలి భర్త రెండవ భార్య నుండి బట్లహల్లి పోలీసులు నిందితుల స్కెచ్ సేకరించారు. పోలీసులు శంకరప్ప యొక్క సిసిటివి ఫుటేజీని వివిధ పాయింట్లలో మరియు కోనపుర బస్ స్టాప్ వద్ద కూడా కనుగొన్నారు. సిసిటివి ఫుటేజ్ నుండి చిత్రాన్ని కనుగొన్న తరువాత, వారు దానిని బాధితురాలి భర్త యొక్క రెండవ భార్యకు మరో:సారి చూపించారు. ఆ రోజు సాయంత్రం వారిని సంప్రదించిన వ్యక్తిగా ఆమె అతన్ని గుర్తించింది.

ఆదివారం ఉదయం బట్లహళ్లిలోని పల్లవి బార్ సమీపంలో శంకరప్పను అరెస్టు చేశారు. అరెస్టు చేసిన తరువాత, శంకరప్ప ఈ నేరాన్ని అంగీకరించాడు. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్లు 302 (హత్య), 376 (అత్యాచారం) కింద అతనిపై కేసు నమోదైంది. గ్రామంలోని కొన్ని ప్రదేశాల నుంచి సిసిటివి ఫుటేజ్‌ను సేకరించి, మృతుడి సహ భార్య, సవతి కుమార్తె సహాయంతో నిందితులను గుర్తించామని బితల్లాహల్లి పోలీస్ స్టేషన్ సబ్ ఇన్‌స్పెక్టర్ టిఎన్ పాపనా తెలిపారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

Jagan 2.0: ఈసారి నాలో జగన్ 2.0ని చూస్తారు, తొలివిడతలో ప్రజల కోసం తాపత్రయ పడి ఓడిపోయా, ఈ సారి కార్యకర్తల కోసం ఎలా పనిచేస్తానో చేసి చూపిస్తానని తెలిపిన వైఎస్ జగన్

Andhra Pradesh: ఏలూరులో దారుణం, ఎమ్మారై స్కానింగ్ చేస్తుండగా రేడియేషన్ తట్టుకోలేక మహిళ మృతి, సుష్మితా డయాగ్నస్టిక్‌ సెంటర్‌ సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని భర్త ఆందోళన

Madhya Pradesh Horror: దారుణం, అంత్యక్రియల గొడవలో తండ్రి మృతదేహాన్ని సగానికి నరికివ్వాలని పట్టుబడిన పెద్ద కొడుకు, చివరకు ఏమైందంటే..

Tensions Erupt in Tadipatri: తన ఇంటికి వెళ్లడానికి వీసా కావాలా, ఎక్కడుందో చెబితే అప్లై చేసుకుంటా, పోలీసులపై మండిపడిన తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి రెచ్చగొడుతున్నారని విమర్శ

Share Now