Leh Bus Accident: ల‌ద్ద‌ఖ్ లో ఘోర ప్ర‌మాదం, 200 మీట‌ర్ల లోయ‌లో ప‌డిపోయిన బ‌స్సు, ఆరుగురు మృతి, ప‌లువురికి తీవ్ర గాయాలు

ప్రయాణికులతో వెళ్తున్న బస్సు లోయలో (Bus Falls) పడింది. (Bus Falls Into Gorge) ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించగా 22 మంది గాయపడ్డారు. కేంద్ర పాలిత ప్రాంతమైన లడఖ్‌లో ఈ సంఘటన జరిగింది. లేహ్‌ (Leh Accident) నుంచి తూర్పు లడఖ్‌కు వెళ్తున్న ప్రైవేట్‌ బస్సుపై డ్రైవర్‌ నియంత్రణ కోల్పోయాడు. దీంతో ఆ బస్సు అదుపు తప్పింది.

Leh BUS Accident

Leh, AUG 22: ప్రయాణికులతో వెళ్తున్న బస్సు లోయలో (Bus Falls) పడింది. (Bus Falls Into Gorge) ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించగా 22 మంది గాయపడ్డారు. కేంద్ర పాలిత ప్రాంతమైన లడఖ్‌లో ఈ సంఘటన జరిగింది. లేహ్‌ (Leh Accident) నుంచి తూర్పు లడఖ్‌కు వెళ్తున్న ప్రైవేట్‌ బస్సుపై డ్రైవర్‌ నియంత్రణ కోల్పోయాడు. దీంతో ఆ బస్సు అదుపు తప్పింది. 200 మీటర్ల లోతైన లోయలోకి దూసుకెళ్లింది. కాగా, ఈ ప్రమాదం గురించి తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు.

Here's Video

ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించినట్లు పోలీసులు తెలిపారు. మరో 22 మంది గాయపడినట్లు చెప్పారు. క్షతగాత్రులను లేహ్‌లోని జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పోలీస్‌ అధికారి తెలిపారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now