Maharashtra Shocker: మహారాష్ట్రలో దారుణం, 3వ సారి కూడా ఆడపిల్ల పుట్టిందని పసిబిడ్డ నోట్లో పొగాకు కుక్కి చంపిన తండ్రి, నిందితుడినని అరెస్ట్ చేసిన పోలీసులు

ఒక కసాయి తండ్రి తన ఎనిమిది రోజుల కుమార్తెను నోటిలో పొగాకుతో నింపి చంపినట్లు జల్గావ్ జిల్లాలోని జామ్నేర్ తాలూకాలో అధికారులు మంగళవారం తెలిపారు. ఈ ఘటనను ఆశా వర్కర్ వెలుగులోకి తీసుకురాగా, గోకుల్ గోతిరామ్ జాదవ్ (30) అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.

Representational picture. (Photo credits: Pixabay)

Mumbai, Sep 15: ఒక కసాయి తండ్రి తన ఎనిమిది రోజుల కుమార్తెను నోటిలో పొగాకుతో నింపి చంపినట్లు జల్గావ్ జిల్లాలోని జామ్నేర్ తాలూకాలో అధికారులు మంగళవారం తెలిపారు. ఈ ఘటనను ఆశా వర్కర్ వెలుగులోకి తీసుకురాగా, గోకుల్ గోతిరామ్ జాదవ్ (30) అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.జాదవ్‌కు ఇద్దరు కుమార్తెలు ఉండగా, సెప్టెంబర్ 2న అతని భార్య వకోడ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మూడో కుమార్తెకు జన్మనిచ్చింది. దీంతో మనస్తాపానికి గురైన జాదవ్ సెప్టెంబర్ 10న పాప నోటిలో పొగాకు వేసి నిద్రపుచ్చడంతో ఊపిరాడక చనిపోయింది. బర్త్ రిజిస్టర్ చేసుకునేందుకు ఆశా వర్కర్ ఇంటికి వెళ్లగా.. బిడ్డ లేదని చెప్పారు.

బీహార్‌లో దారుణం, కొడుకు పుట్టాలంటే ఇద్దరు కూతుర్లపై అత్యాచారం చేయాలని తండ్రికి తాంత్రికుడు సలహా, ఆ మాటలు నమ్మి కూతుర్లపై ఏళ్ళ తరబడి తండ్రి రేప్

ఈ విషయాన్ని ఆశా వర్కర్‌ అధికారులకు తెలియజేయడంతో వైద్యాధికారి డాక్టర్‌ సందీప్‌ కుమావత్‌ మంగళవారం గ్రామానికి చేరుకుని జాదవ్‌ను చిన్నారి గురించి అడిగి తెలుసుకున్నారు. అనారోగ్యం కారణంగానే చిన్నారి చనిపోయిందని డాక్టర్ కుమావత్‌కు ప్రాథమికంగా చెప్పారు. అయితే డాక్టర్ జాదవ్‌ను ప్రశ్నించగా.. చిన్నారిని హత్య చేసినట్లు అంగీకరించాడు. జాదవ్ కూడా ఫర్దాపూర్ వాకోడ్ రోడ్డులో గొయ్యి తవ్వి, రాత్రి మృతదేహాన్ని పారవేసినట్లు చెప్పారు.జాదవ్‌పై కేసు నమోదు చేశారు. సెప్టెంబరు 10న థానే జిల్లాలో భార్యతో గొడవ పడి ఓ కూలీ తన 18 నెలల కుమార్తెను కొట్టి చంపిన సంగతి తెలిసిందే.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement