Living Together: సహజీవనం చేస్తున్నవాళ్ల మధ్యలోకి మూడోవ్యక్తి వెళ్లొద్దు, యూపీ దంపతుల కేసులో ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు, దంపతులుగా జీవించడానికి అంగీకరించిన తర్వాత జోక్యం ఉండొద్దు
పరస్పర అంగీకారంతో భార్యాభర్తలుగా జీవిస్తున్న ఇద్దరు మేజర్ల మధ్యలోకి కుటుంబ సభ్యులతో సహా మూడో వ్యక్తి జోక్యం తగదని ఢిల్లీ హైకోర్టు (Delhi High) వ్యాఖ్యానించింది. కుల, మతాలతో సంబంధం లేకుండా, ఒక్కటిగా బతికే వివాహిత జంటకు తగిన రక్షణ కల్పించాలని రాజ్యాంగం నిర్దేశిస్తోందని ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తుషార్ రావు గేదెల (Tushar rao gedala) పేర్కోన్నారు.
New Delhi, July 25: పరస్పర అంగీకారంతో భార్యాభర్తలుగా జీవిస్తున్న ఇద్దరు మేజర్ల మధ్యలోకి కుటుంబ సభ్యులతో సహా మూడో వ్యక్తి జోక్యం తగదని ఢిల్లీ హైకోర్టు (Delhi High) వ్యాఖ్యానించింది. కుల, మతాలతో సంబంధం లేకుండా, ఒక్కటిగా బతికే వివాహిత జంటకు తగిన రక్షణ కల్పించాలని రాజ్యాంగం నిర్దేశిస్తోందని ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తుషార్ రావు గేదెల (Tushar rao gedala) పేర్కోన్నారు. దేశంలోని పౌరులకు ఎటువంటి హాని జరగకుండా రక్షణ కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిది, అధికార యంత్రాంగానిదేనని ఆయన అన్నారు. కుటుంబ సభ్యుల అభీష్టానికి వ్యతిరేకంగా ఉత్తరప్రదేశ్కు (Uttarpradesh) చెందిన ఒక యువతి ఆమెకు నచ్చిన వ్యక్తితో కలిసి ఉంటోంది. ఆమె కుటుంబ సభ్యుల నుంచి ప్రాణ భయంతో ఆ జంట తప్పించుకు తిరుగుతోంది. ఈ నేపధ్యంలో ఆ యువతి దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు (Delhi High) బెంచ్ ఈ వ్యాఖ్యలు చేసింది.
యూపీలో తన తండ్రి చాలా పరపతి గల వ్యక్తి అని, తండ్రినుంచి ప్రాణభయం ఉన్నందున తరచూ వేర్వేరు హోటళ్లకు మారుతూ కాలం వెళ్లదీస్తున్నామని, రక్షణ కల్పించేదాకా మా దంపతులకు మనశ్శాంతి ఉండదని ఆమె కోర్టుకు నివేదించారు. కుటుంబ సభ్యులు తన బంధంపై వేధించి, చిత్ర హింసలు పెట్టటం వల్లే తాను ఇంటి నుంచి వెళ్లిపోయానని ఆమె తెలిపింది. మా ఫ్రేమ్వర్క్లోని రాజ్యాంగ న్యాయ స్థానాలు పౌరులను రక్షించడానికి ఆదేశాలు జారీ చేయడానికి అధికారం కలిగి ఉంటాయి.
ప్రత్యేకించి ప్రస్తుత వివాదానికి సంబంధించిన కేసులలో ఇద్దరు పెద్దలు భార్యాభర్తలుగా కలిసి జీవించడానికి అంగీకరించిన తర్వాత వారి విషయంలో ఎటువంటి జోక్యం ఉండదు. వారి కుటుంబంతో సహా మూడవ పక్షాల నుండి జీవిస్తుంది. మన రాజ్యాంగం కూడా దానిని నిర్ధారిస్తుంది” అని కోర్టు తన ఇటీవలి ఉత్తర్వుల్లో పేర్కొంది. పిటిషనర్ దంపతుల భద్రత కోసం స్ధానిక బీట్ పోలీసు అధికారులు వచ్చే మూడు వారాల పాటు రెండు రోజులకు ఒకసారి వారిని గమనిస్తూ వారి జాగ్రత్తలు చూడాలని కోర్టు పేర్కొంది.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)