Caste Certificate Not Mandatory: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఇకపై వారికి కుల ధృవీకరణపత్రం అవసరం లేదు, సంచలన నిర్ణయం తీసుకున్న రాజస్థాన్ ప్రభుత్వం, ఒక అఫిడవిట్ ద్వారా ఇకపై జాబ్‌కు అప్లై చేసుకోవచ్చు

ఓబీసీ, ఎంబీసీ సహా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు అర్హత కలిగినవారు ప్రభుత్వం అందించే గుర్తింపు పత్రం అవసరం లేకుండానే ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. వెనుకడిన తరగతులు (OBC), అత్యంత వెనుకవడిన తరగతులు (MBC) సహా ఆర్థికంగా వెనుకబడిన తరగతుల (EWS) వారు ఒక అఫిడవిట్ సబ్మిట్ చేయడం ద్వారా ప్రభుత్వ ఉద్యోగానికి అప్లై చేయవచ్చు.

Rajasthan Chief Minister Ashok Gehlot (Photo-Twitter)

Jaipur, OCT 15: రిజర్వేషన్ కేటగిరీకి చెందిన ధ్రువపత్రం అక్కర్లేకుండా ప్రభుత్వ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవడానికి వెసులుబాటు కల్పించింది రాజస్తాన్ ప్రభుత్వం (Rajasthan government). ఈ ప్రతిపాదనకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ (Ashok Gehlot) శనివారం ఆమోదముద్ర వేశారు. దీని ప్రకారం.. ఓబీసీ, ఎంబీసీ సహా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు అర్హత కలిగినవారు ప్రభుత్వం అందించే గుర్తింపు పత్రం అవసరం లేకుండానే ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. వెనుకడిన తరగతులు (OBC), అత్యంత వెనుకవడిన తరగతులు (MBC) సహా ఆర్థికంగా వెనుకబడిన తరగతుల (EWS) వారు ఒక అఫిడవిట్ సబ్మిట్ చేయడం ద్వారా ప్రభుత్వ ఉద్యోగానికి అప్లై చేయవచ్చు.

Ekta Kapoor: యువతను చెడగొడుతున్నావ్! ఏక్తా కపూర్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం, XXX వెబ్‌ సిరీస్‌పై కేసులో ఏక్తాకు ఎదురదెబ్బ, ప్రతిసారి కోర్టును ఆశ్రయించడం సరికాదు, కోర్టు ఉన్నది నోరులేని వారికోసం, ఏక్తాకపూర్‌పై అరెస్ట్ వారెంట్, కేసును సమర్ధించిన అత్యున్నత న్యాయస్థానం 

దీనికి కుల ధ్రువీకరణ పత్రం అక్కర్లేదు. ఈ నిర్ణయం ద్వారా రాష్ట్రంలోని చాలా మంది అభ్యర్థులు ప్రయోజనం పొందుతారని రాజస్తాన్ ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు.  ఈ సర్క్యూలర్ జనవరి 20నే ఇచ్చారు. కాగా, తాజాగా ముఖ్యమంత్రి దీనికి ఆమోదం తెలిపారు.

Student Molested: రోడ్డుపై వెళ్తున్న స్కూల్ విద్యార్ధినిని ఆటోలోకి లాగి అఘాయిత్యం, ఎందుకు కామెంట్ చేశావని అడిగినందుకు  మృగంలా ప్రవర్తించిన ఆటో డ్రైవర్‌, సీసీటీవీలో రికార్డయిన అకృత్యం 

ఈ సర్క్యులర్‌కు అనుగుణంగా లైవ్‌స్టాక్ అసిస్టెంట్ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ఎగ్జామినేషన్-2021, జూనియర్ ఇంజనీర్ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ఎగ్జామినేషన్-2022, పట్వార్ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ఎగ్జామినేషన్-2021 ఉద్యోగాల భర్తీకి జనవరి 20, 2022 లోపు ప్రకటన చేయడం వల్ల.. తాజా నిర్ణయం వాటికి వర్తిస్తుందా లేదా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. అయితే ఈ విషయంలో ప్రభుత్వం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now