Omicron in India: ఒమైక్రాన్ బాధితుల్లో యువకులే అధికం, రోగులలో గొంతు నొప్పి, జ్వరం, దగ్గు మాత్రమే ఉన్నాయని తెలిపిన ఐసీఎంఆర్ సర్వే

కరోనావైరస్ థర్డ్ వేవ్‌లో దేశంలోని ఒమైక్రాన్ బాధితుల్లో యువతరమే అధికంగా ఉందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ICMR) సర్వే వెల్లడించింది. కోవిడ్ రోగులకు తక్కువ ఆరోగ్య సమస్యలు ఉండటంతో మందుల వాడకం కూడా తగ్గిపోయిందని ప్రభుత్వం తెలిపింది.

omicron (Photo-IANS)

New Delhi, Feb 4: కరోనావైరస్ థర్డ్ వేవ్‌లో దేశంలోని ఒమైక్రాన్ బాధితుల్లో యువతరమే అధికంగా ఉందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ICMR) సర్వే వెల్లడించింది. కోవిడ్ రోగులకు తక్కువ ఆరోగ్య సమస్యలు ఉండటంతో మందుల వాడకం కూడా తగ్గిపోయిందని ప్రభుత్వం తెలిపింది. దేశవ్యాప్తంగా 37 ఆసుపత్రుల నుంచి కరోనా రోగుల డేటాను సేకరించినట్లు ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరామ్ భార్గవ తెలిపారు.

మూడవ వేవ్ సమయంలో ఆసుపత్రిలో చేరిన వారి సగటు వయస్సు దాదాపు 44సంవత్సరాలని (infected younger population) బలరాం చెప్పారు. అంతకుముందు కరోనా రోగుల సగటు వయస్సు 55 ఏళ్లని వైద్యులు చెప్పారు. 2021వ సంవత్సరం డిసెంబర్ 16 నుంచి 2022వ సంవత్సరం జనవరి 17వతేదీ మధ్య ఆసుపత్రిలో చేరిన కరోనా రోగుల డేటాను విశ్లేషించగా యువతీ,యువకులకే అధికంగా ఒమైక్రాన్ సోకిందని తేలింది. ఒమైక్రాన్ రోగుల్లో గొంతు నొప్పి, జ్వరం, దగ్గు సమస్యలు ఎక్కువగా కనిపించాయని డాక్టర్లు చెప్పారు. థర్డ్ వేవ్ ఒమైక్రాన్ (Omicron in India) పాజిటివ్ రోగులకు కరోనా లక్షణాలు తక్కువగానే ఉన్నాయని ఐసీఎంఆర్ సర్వేలో తేలిందని వైద్యులు వివరించారు

భారత్‌ లో 13శాతం తగ్గిన కరోనా రోజువారీ కేసులు, 9.27శాతానికి చేరిన డైలీ పాజిటివిటీ రేటు, ఆందోళనకర స్థాయిలో కరోనా మరణాలు

కరోనావైరస్ యొక్క ఓమిక్రాన్ వేరియంట్ ప్రపంచవ్యాప్తంగా మూడవ కోవిడ్ ఉప్పెనకు ఆజ్యం పోస్తున్నందున, భారతదేశంలో కూడా కేసులు పెరిగాయి. గత కొన్ని వారాలుగా ప్రతిరోజూ పెరుగుతూనే ఉన్నాయి. పరీక్షలను పెంచితే కేసుల సంఖ్య నమోదయ్యే దానికంటే చాలా ఎక్కువగా ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు.

డెల్టా వేవ్ మరియు ఓమిక్రాన్ వేవ్ మధ్య తేడాలు ఇక్కడ ఉన్నాయి

1. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది మరియు వాసన లేదా రుచి కోల్పోవడం ఓమిక్రాన్ వేవ్‌లో ప్రాథమిక లక్షణాలు కాదు. రోగులలో గొంతు నొప్పి, జ్వరం, దగ్గు ఎక్కువగా నివేదించబడ్డాయి.

2. 3వ వేవ్‌లో అన్ని లక్షణాలు తక్కువగా ఉన్నాయి

3. 3వ వేవ్‌లో సోకిన, ఆసుపత్రిలో చేరిన రోగుల సగటు వయస్సు 55 సంవత్సరాల క్రితంతో పోలిస్తే 44 సంవత్సరాలు.

4. కొమొర్బిడిటీల ఉనికి మునుపటి 66%తో పోలిస్తే 46% తక్కువగా ఉంది

5. థర్డ్ వేవ్ సమయంలో డ్రగ్స్ చాలా తక్కువగా వాడటం గమనించబడింది. చాలా కేసులలో తక్కువ సమస్యలు ఉన్నాయి.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement