Bihar: స్కూలులో బాలికపై అత్యాచారం, ప్రిన్సిపాల్‌కు ఉరిశిక్ష విధించిన కోర్టు, సహకరించిన మరో ఉపాధ్యాయుడికి జీవిత ఖైదు అమలు, తీర్పు వెలువరించిన ప్రత్యేక పోక్సో కోర్టు

అత్యాచారం కేసులో పాట్నా కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. బీహార్ లో 11 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో కోర్టు స్కూల్‌ ప్రిన్సిపాల్‌కు ఉరిశిక్ష ( School Principal and a Teacher Gets Death Sentence) విధించింది. అతనికి సహకరించిన మరో ఉపాధ్యాయుడికి జీవిత ఖైదీగా అమలు చేస్తూ ప్రత్యేక పోక్సో కోర్టు మంగళవారం తీర్పునిచ్చింది.

School Principal and a Teacher Gets Death Sentence for Raping Class 5 Student (Photo-PTI)

Patna, Feb 16: అత్యాచారం కేసులో పాట్నా కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. బీహార్ లో 11 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో కోర్టు స్కూల్‌ ప్రిన్సిపాల్‌కు ఉరిశిక్ష ( School Principal and a Teacher Gets Death Sentence) విధించింది. అతనికి సహకరించిన మరో ఉపాధ్యాయుడికి జీవిత ఖైదీగా అమలు చేస్తూ ప్రత్యేక పోక్సో కోర్టు మంగళవారం తీర్పునిచ్చింది.

ఫుల్వారీ షరీఫ్ ప్రాంతంలోని ఓ పాఠశాలలో 11 సంవత్సరాల బాలిక 5వ తరగతి చదువుతోంది. ఆ పాఠశాలలో అరవింద్ కుమార్ ప్రిన్సిపాల్‌గా పనిచేస్తుండగా.. అభిషేక్ కుమార్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో 2018 సెప్టెంబర్‌లో ప్రిన్సిపాల్ అరవింద్ కుమార్ తన స్కూళ్లో చదువుతున్న బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ దారుణం చేయడానికి స్కూల్‌ టీచర్‌ అభిషేక్ కుమార్ కూడా సహకరించాడు.

కాగా కొన్ని రోజుల తర్వాత బాలిక తీవ్ర అస్వస్థతకు గురికావడంతో తల్లిదండ్రులు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్ళారు. అక్కడ వైద్యులు పరీక్షలు చేయగా.. బాలిక గర్భవతి అని తేలింది. దాంతో బాలిక తల్లి ఏం జరిగిందో చెప్పాలని తల్లి నిలదీయగా అసలు విషయం బయటపడింది. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఈ విషయంపై ఫిర్యాదు చేయగా.. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు ప్రిన్సిపాల్‌ను, టీచర్‌ను అరెస్ట్ చేశారు.

ఇంత ఘోరమా..అంబులెన్స్‌లోనే ఎస్ఐ ఆత్మహత్య, ఆస్పత్రిలో చేర్చుకోకపోవడమే కారణం, పోలీస్‌ వర్గాల్లో కలకలం రేపుతున్న ఘటన, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపిన ఢిల్లీ సౌత్ ఈస్ట్ డీసీపీ మీనా

ఆ కేసుకు సంబంధించి నేడు పాట్నా కోర్టు ప్రిన్సిపాల్‌కు మరణశిక్షను విధిస్తూ.. లక్ష రూపాయల జరిమానా కట్టాలని తీర్పు వెల్లడించింది. అదేవిధంగా ఆయనకు సహకరించిన ఉపాధ్యాయుడికి రూ. 50,000 జరిమానాతో పాటు జీవిత ఖైదు విధించింది.

 

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

Delhi Election 2025 Updates: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్... ఓటేసిన ప్రముఖులు, త్రిముఖ పోరులో విజేత ఎవరో, సాయంత్రం 6.30 గంటలకు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు!

Telangana Caste Census: : వీడియో ఇదిగో, కులగణన సర్వే పేపర్లు తగలబెట్టిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, క్రమశిక్షణ చర్యలు తీసుకునే యోచనలో టీపీసీసీ

Supreme Court: నేరం రుజువు కావాలంటే నిందితుడు బహిరంగంగా దూషించాలి.. నాలుగు గోడల మధ్య జరిగితే కేసు నిలబడదు.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

Delhi Election 2025: ఢిల్లీ ఎన్నికలకు ముందే కేజ్రీవాల్‌కు షాక్, ఏడుగురు ఆప్ ఎమ్మెల్యేలు రాజీనామా, రానున్న ఎన్నికల్లో పార్టీ టికెట్లు ఇవ్వకపోవడంతో గుడ్ బై

Share Now