Same-Sex Marriage: స్వలింగ సంపర్కుల వివాహంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు, ఇది చాలా సెమినల్ ఇష్యూ అంటూ రాజ్యాంగ ధర్మాసనానికి కేసు బదిలీ
స్వలింగ సంపర్కుల వివాహాన్ని గుర్తించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనానికి సుప్రీంకోర్టు (Supreme Court) సోమవారం బదిలీ చేసింది.
New Delhi, Mar 13: స్వలింగ సంపర్కుల వివాహాన్ని గుర్తించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనానికి సుప్రీంకోర్టు (Supreme Court) సోమవారం బదిలీ చేసింది.స్వలింగ సంపర్కుల వివాహానికి (Same-Sex Marriage) చట్టబద్ధమైన ధృవీకరణ దేశంలోని వ్యక్తిగత చట్టాల యొక్క సున్నితమైన సమతుల్యతతో, ఆమోదించబడిన సామాజిక విలువలతో "పూర్తి విధ్వంసం" కలిగిస్తుందని అఫిడవిట్లో కేంద్రం వాదించింది. కేంద్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, చట్టబద్ధమైన విధానం వివాహాన్ని జీవసంబంధమైన పురుషుడు, జీవసంబంధమైన స్త్రీ మధ్య మాత్రమే బంధంగా గుర్తిస్తుందని నొక్కి చెప్పారు.
స్వలింగ సంపర్కుల వివాహాన్ని చట్టబద్ధంగా గుర్తించాలా వద్దా అనేది పార్లమెంటు నిర్ణయించాలని కేంద్రం వాదించింది. ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ జెబి పార్దివాలాతో కూడిన ధర్మాసనం రాజ్యాంగంలోని ఆర్టికల్ 145 (3)ని అమలు చేస్తుందని మరియు ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ద్వారా ఈ అంశాన్ని నిర్ణయిస్తుందని తెలిపింది. "ఇది చాలా సెమినల్ ఇష్యూ" అని బెంచ్ పేర్కొంది. ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఆయా కేసులను ఏప్రిల్ 18న విచారించనున్నాయి. ఈ అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకున్నా సమాజంపై భారీగా ప్రభావం చూపుతుందని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది.
ఇంతకు ముందు స్వలింగ సంపర్కుల వివాహం చట్టబద్ధత విషయంలో కేంద్రం ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ సందర్భంగా స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత కల్పించలేమని స్పష్టం చేసింది. చరిత్రలో ఎక్కడా ఇలాంటి వాటికి గుర్తింపు లేదని, ఇది కుటుంబ వ్యవస్థకు విఘాతమని కేంద్రం పేర్కొంది. స్వలింగ సంపర్కులు కలిసి జీవించడం నేరం కాదన్న కేంద్ర ప్రభుత్వం.. వారిని భార్యభర్తలలా చూడాలనడం భారతీయ కుటుంబ వ్యవస్థకు విరుద్ధమని తెలిపింది.
భారత్లో పురుషుడు భర్త అవుతాడనీ, స్త్రీ భార్య అవుతుందదని, వారికి పిల్లలు పుట్టాక తల్లిదండ్రులు అవుతారని అఫిడవిట్లో పేర్కొంది. వివాహ వ్యవస్థలో ఎన్నో బాధ్యతాయుత అంశాలు ముడిపడి ఉన్నాయని తెలిపింది. స్వలింగ వివాహాలకు గుర్తింపు ఇవ్వకపోవడం అనేది చట్టవ్యతిరేకం కాదన్న కేంద్రం.. సమాజ నిర్మాణానికి స్త్రీ, పురుషుల మధ్య వివాహమనేది కీలకమని చెప్పింది. భారతీయ సమాజం దీనిపైనే ఆధారపడి ఉందని పేర్కొంది. అఫిడవిట్పై సొలిసిటర్ జనరల్ తుషార్ మెహద్ వాదనలు వాదనలు ప్రేమించే హక్కు, భావప్రకటనా స్వేచ్ఛ, ఎంపిక చేసుకునే హక్కు ఇప్పటికే ఉన్నదని, ఆ హక్కులో ఎవరూ జోక్యం చేసుకోవడం లేదన్నారు.
హిందూ వివాహ చట్టం, విదేశీ వివాహ చట్టం, ప్రత్యేక వివాహ చట్టం, ఇతర వివాహ చట్టాలలోని కొన్ని నిబంధనలు రాజ్యాంగ విరుద్ధమని, స్వలింగ జంటలకు వివాహం చేసుకునే హక్కు లేదా ప్రత్యామ్నాయంగా వీటిని చదవడాన్ని వారు నిరాకరిస్తున్నారని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై కేంద్రం స్పందించింది.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)