UP Shocker: కూతురు ప్రేమను ప్రశ్నిస్తే తండ్రిపై పెట్రోల్ పోసి చంపేశారు, ఉత్తరప్రదేశ్‌లో దారుణ ఘటన, పరారీలో కుటుంబ సభ్యులు

యూపీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కూతురి ప్రేమ వ్యవహారాన్ని ప్రశ్నించినందుకు ఓ తండ్రిని కుటుంబం దారుణంగా హత్య చేసింది. కూతురుతో కలిసి కుటుంబసభ్యులే అతడిపై పెట్రోల్‌ పోసి (MAN SET ABLAZE) నిప్పంటించారు. ఉత్తరప్రదేశ్‌లోని బోదాన్‌ జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన చూసింది.

Representational Image | (Photo Credits: PTI)

Lucknow, Jan 10: యూపీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కూతురి ప్రేమ వ్యవహారాన్ని ప్రశ్నించినందుకు ఓ తండ్రిని కుటుంబం దారుణంగా హత్య చేసింది. కూతురుతో కలిసి కుటుంబసభ్యులే అతడిపై పెట్రోల్‌ పోసి (MAN SET ABLAZE) నిప్పంటించారు. ఉత్తరప్రదేశ్‌లోని బోదాన్‌ జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన చూసింది.

పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బోదాన్‌ జిల్లా వాజిర్‌గంజ్‌ ఏరియా హత్రా గ్రామానికి చెందిన అమిర్‌కు (Mohammad Aamir) ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నారు. పెద్ద కూతురు అదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తిని ప్రేమిస్తోంది. ఈ విషయం అమిర్‌కు తెలియటంతో ఈ నెల 5వ తేదీన కూతుర్ని నిలదీశాడు. ఈ నేపథ్యంలో కుటుంబసభ్యులకు అమిర్‌కు మధ్య గొడవ చోటుచేసుకుంది.

దీంతో ఆగ్రహానికి గురైన వారు అతడిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. 30 శాతం కాలిన గాయాలతో ఇంట్లోనే స్పృహ తప్పిపడిపోయాడు పొరుగింటివారు ఇచ్చిన సమాచారంతో అక్కడకు చేరుకున్న పోలీసులు అమిర్‌ను ఆసుపత్రికి తరలించారు. అతడి వాగ్మూలం మేరకు కుటుంబసభ్యులపై కేసు నమోదు చేసుకున్నారు.

మహిళపై కామాంధులు సామూహిక అత్యాచారం, నిర్భయ ఘటనను తలపించేలా జార్ఖండ్‌లో దారుణం, చావు బతుకులతో పోరాడుతున్న బాధితురాలు

శుక్రవారం చికిత్స పొందుతూ బాధితుడు మృతిచెందాడు. కుటుంబసభ్యులు పరారీలో ఉండటంతో దగ్గరి బంధువులు, పొరిగింటివారు, పోలీసులు ఆయన అంత్యక్రియలు నిర్వహించారు.కుటుంబ సభ్యులపై పోలీసులు సెక్షన్ 307 (హత్యాయత్నం) కింద ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Bhupalapally Murder Case: భూవివాదం నేపథ్యంలోనే రాజలింగమూర్తి హత్య అన్న బీఆర్ఎస్..సీబీసీఐడీతో విచారిస్తామ్న మంత్రి కోమటిరెడ్డి, భూపాలపల్లి హత్య నేపథ్యంలో కాంగ్రెస్ - బీఆర్ఎస్ మాటల యుద్ధం

Faridabad Shocker: దారుణం, దొంగ‌త‌నం ఎందుకు చేశావని అడిగినందుకు తండ్రిని తగలబెట్టిన కొడుకు, మంటలకు తాళలేక అరుస్తుంటే బయట తలుపు గడియపెట్టి పైశాచికానందం

Manmohan Singh Last Rites: మన్మోహన్ సింగ్‌కు కన్నీటి వీడ్కోలు...కడసారి చూసేందుకు భారీగా తరలివచ్చిన ప్రజలు..నిగమ్‌బోధ్ ఘాట్‌లో మన్మోహన్‌ అంత్యక్రియలు

Manmohan Singh Last Rites On Saturday: శనివారం మన్మోహన్‌ సింగ్‌ అంత్యక్రియలు.. ఏడు రోజులు సంతాపదినాలు.. ప్రభుత్వ భవనాలపై జాతీయ పతాకం సగానికి అవనతం

Advertisement
Advertisement
Share Now
Advertisement