Amrit Mahotsav: దేశవ్యాప్తంగా నేటి నుంచి 'ఆజాది కా అమృత్ మహోత్సవ్' వేడుకలు, సబర్మతీ ఆశ్రమం నుండి 75వ స్వాతంత్య్ర వేడుకలకు శ్రీకారం చుట్టిన ప్రధాని మోదీ, తెలంగాణలో వేడుకలు ప్రారంభించిన సీఎం కేసీఆర్
ఇందుకోసం 'అమృత్ మహోత్సవ్' పేరుతో 75 వారాల పాటు దేశంలోని 75 ప్రాంతాల్లో ఆనాటి స్వాతంత్య్రోద్యమ స్పూర్తిని రగిలించే వివిధ కార్యక్రమాలను నిర్వహించనున్నారు.....
Ahmedabad, March 12: వచ్చే ఏడాదికి భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు చిరస్మరణీయంగా నిలిచిపోలాని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం 'అమృత్ మహోత్సవ్' పేరుతో 75 వారాల పాటు దేశంలోని 75 ప్రాంతాల్లో ఆనాటి స్వాతంత్య్రోద్యమ స్పూర్తిని రగిలించే వివిధ కార్యక్రమాలను నిర్వహించనున్నారు.
మహాత్మాగాంధీ 'దండి మార్చ్' ప్రారంభించిన ఈరోజు (మార్చి 12) నుంచే అమృత్ మహోత్సవ్ వేడుకలు ప్రారంభం అవుతున్నాయి.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం అహ్మదాబాద్ లోని సబర్మతి ఆశ్రమంలో గాంధీజీ చిత్రపటానికి నివాళులర్పించి వేడుకలకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా సబర్మతీ ఆశ్రమం నుండి దండి వరకు నిర్వహించే పాదయాత్రకు ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించారు. స్వాతంత్య్రోద్యమంలో చిరస్థాయిగా నిలిచిన మహాత్మా గాంధీ 'దండి మార్చ్' స్మృతులను గుర్తుచేసుకుంటూ సుమారు 280 కిలోమీటర్ల వరకు 25 రోజుల పాటు సాగే ఈ పాదయాత్ర ఏప్రిల్ 5న ముగియనుంది. ముగింపు రోజున దండిలో భారీ బహిరంగ సభ షెడ్యూల్ చేశారు.
PM Modi flags off 'padyatra' from Ahmedabad to Dandi:
ఇక ఇటు తెలంగాణలో ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు శుక్రవారం హైదరాబాదులోని పబ్లిక్ గార్డెన్స్ లో జాతీయ జెండాను ఎగరవేసి 'ఆజాది కా అమృత్ మహోత్సవ్' వేడుకలను ప్రారంభించారు. భారత స్వాతంత్య్ర పోరాటం ప్రపంచ ఉద్యమాల చరిత్రలోనే ఒక మహోజ్వల ఘట్టంగా కేసీఆర్ అభివర్ణించారు.
Amrit Mahotsav in Telangana:
మహాత్మా గాంధీ ముందు చాలా మంది స్వేచ్ఛ కోసం పోరాడారు. కానీ మహాత్మా గాంధీ వచ్చిన తరువాతే స్వాతంత్య్ర సంగ్రామం ఉవ్వెత్తున ఎగిసింది. మహాత్ముడు చేపట్టిన ఉప్పు సత్యాగ్రహం దేశం మొత్తాన్ని ఏకం చేసిందని కేసీఆర్ అన్నారు. భారతదేశ స్వాతంత్య్ర చరిత్ర భావి తరాలకు అందించాలని కేసీఆర్ పేర్కొన్నారు.
Tags
సంబంధిత వార్తలు
Leopard Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్ పోర్టులో చిరుత కలకలం.. విమానాశ్రయం ప్రహరీ దూకి లోపలికి వచ్చినట్లు గుర్తించిన అధికారులు.. పట్టుకునేందుకు రెండు బోన్ల ఏర్పాటు
Heat Waves in Telangana: నిప్పుల కొలిమిలా తెలంగాణ.. 45 డిగ్రీలు దాటేసిన ఉష్ణోగ్రతలు.. నేడు, రేపు మరింత పెరుగనున్న ఉష్ణోగ్రతలు
2024 భారతదేశం ఎన్నికలు: ఏపీలో పెద్ద ఎత్తున నామినేషన్ల తిరస్కరణ, 175 స్థానాల్లో 2705 నామినేషన్లకు ఆమోదం, తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలకు 625 నామినేషన్లకు ఈసీ ఓకే
Inter Advanced Supplementary Exams: తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదల, మే 24 నుంచి పరీక్షలు, పూర్తి టైం టేబుల్ ఇదుగోండి
2024 భారతదేశం ఎన్నికలు: ప్రధాని మోదీ బహుశా స్టేజి మీదనే ఏడుస్తారేమో! ఎన్నికల ప్రచారంలో రాహుల్ సంచలన వ్యాఖ్యలు, ఇక రెండో దశ పోలింగ్ పై ప్రధాని మోదీ ఆసక్తికర ట్వీట్
Orange Alert for Telangana: మండుతున్న ఎండలు, తెలంగాణలో ఆరెంజ్ అలెర్ట్, వచ్చే 5 రోజులు వడగాలులతో జాగ్రత్తగా ఉండాలని ఐఎండీ హెచ్చరిక
Hyderabad Fire: వీడియోలు ఇవిగో, భారీ అగ్నిప్రమాదంలో భయంతో బిల్డింగ్ పై నుండి దూకుతున్న సిబ్బంది, మంటల్లో చిక్కుకున్న 50 మంది
Lok Sabha Polls Phase II: ముగిసిన రెండో దశ పోలింగ్, సాయంత్రం 5 గంటల వరకు 13 రాష్ట్రాల్లో నమోదైన పోలింగ్ శాతం ఇదిగో..
తాజా వార్తలు
ట్రెండింగ్
SocialLY
Heat Wave In Telangana, AP: తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు.. పలు జిల్లాల్లో డిగ్రీలు దాటుతున్న ఉష్ణోగ్రతలు.. తెలంగాణలో 9 జిల్లాలకు కొనసాగుతున్న ఆరెంజ్ అలర్ట్..
Chennai Toddler Saving: డియర్ చెన్నైస్.. మీరు సూపర్బ్.. అందరూ కలిసి నెలల చిన్నారిని కాపాడటం వావ్.. వైరల్ వీడియో మీరూ చూడండి!
Jewellery Theft: నగలు కొనడానికి వచ్చినట్టు నటించి మాయ మాటలు చెప్పి 50 తులాల వెండిని, ఆభరణాలను చోరీ చేసిన మహిళలు.. మెదక్ లో ఘటన (వీడియో)
Traffic Noise Cardiovascular Disease Link: ట్రాఫిక్ శబ్ధం పెరిగితే గుండె జబ్బులు మరింత పెరిగే ప్రమాదం.. జర్మనీ పరిశోధకుల వెల్లడి