West Bengal: బెంగాల్‌ గవర్నర్‌ వర్సెస్ సీఎం, మరింత ముదురుతున్న వివాదం, కొత్త చట్టం చేసిన మమతా బెనర్జీ, యూనివర్సిటీ ఛాన్సలర్‌గా దీదీ, అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెడతామని ప్రకటన

రాష్ట్రంలోని యూనివర్సిటీలకు (state universities) ఛాన్స్‌లర్‌గా (Chancellor) ఇకపై సీఎం వ్యవహరించేలా కొత్త చట్టం రూపొందించింది పశ్చిమ బెంగాల్ (West Bengal ) ప్రభుత్వం. సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee)అధ్యక్షతన గురువారం సమావేశమైన రాష్ట్ర క్యాబినెట్ కొత్త చట్టాన్ని ఆమోదిస్తూ నిర్ణయం తీసుకుంది

Mamata-Banerjee (Photo Credits: IANS/File)

Kolkata, May 26: రాష్ట్రంలోని యూనివర్సిటీలకు (state universities) ఛాన్స్‌లర్‌గా (Chancellor) ఇకపై సీఎం వ్యవహరించేలా కొత్త చట్టం రూపొందించింది పశ్చిమ బెంగాల్ (West Bengal ) ప్రభుత్వం. సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee)అధ్యక్షతన గురువారం సమావేశమైన రాష్ట్ర క్యాబినెట్ కొత్త చట్టాన్ని ఆమోదిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు రాష్ట్రంలోని యూనివర్సిటీలకు గవర్నర్ ఛాన్స్‌లర్‌గా ఉంటున్నారు. కొత్త చట్టం ఆమోదం పొందితే, సీఎం ఛాన్స్‌లర్‌ అవుతారు. కొత్త బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెడతారు. అక్కడ ఆమోదించిన తర్వాత, గవర్నర్ (Governor) కూడా అంగీకారం తెలపాల్సి ఉంటుంది. గవర్నర్ ఆమోదం పొందిన తర్వాత నుంచి ఈ చట్టం అమల్లోకొస్తుంది.

CM KCR on National Politics: కేంద్రంలో మార్పును ఎవరూ ఆపలేరు, రెండు మూడు నెల‌ల త‌ర్వాత సంచ‌ల‌న వార్త వింటారు, దేవేగౌడతో మీటింగ్ అనంతరం సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు 

పశ్చిమ బెంగాల్‌లోని యూనివర్సిటీల విషయంలో కొంతకాలంగా సీఎం మమతా బెనర్జీ, గవర్నర్ జగ్‌దీప్ ధన్‌కార్ (Jagadeep Dhankar) మధ్య వివాదం నడుస్తోంది. దీంతో గవర్నర్‌ నుంచి ఛాన్స్‌లర్‌ పదవిని తీసుకోవాలని మమత భావిస్తోంది. దీనికోసమే కొత్త చట్టాన్ని క్యాబినెట్ ఆమోదించింది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లును సభలో ప్రవేశపెడతామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బ్రత్యా బసు తెలిపారు. దీనిపై రాజ్‌భవన్ వర్గాల నుంచి ఇంకా ఎలాంటి స్పందనా రాలేదు. ప్రస్తుతం రాష్ట్రంలోని 17 యూనివర్సిటీలకు గవర్నర్ ఎక్స్-అఫీషియో ఛాన్స్‌లర్‌గా కొనసాగుతున్నారు.

Chandrakant Patil: సుప్రీయా సూలే..నీకు రాజకీయాలు ఎందుకు వంట చేసుకోమన్న మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రకాంత్ పాటిల్‌, మండిపడుతున్న ఎన్సీపీ పార్టీ 

కాగా, ప్రభుత్వ నిర్ణయంపై బీజేపీ (BJP) స్పందించింది. ‘‘మమతా బెనర్జీ అధికారం అంతా తన చేతుల్లోనే ఉండాలనుకుంటోంది. తనను ఎవరూ ప్రశ్నించకూదనేది ఆమె ఉద్దేశం. ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకే ఇలాంటి నిర్ణయం తీసుకుంది’’ అని బీజేపీ విమర్శించింది.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..

MLC Candidates: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ టికెట్ దాసోజు శ్రవణ్ కు.. కాంగ్రెస్ అభ్యర్ధులుగా అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు

Congress MLC Candidates: మరోసారి చట్టసభల్లోకి రాములమ్మ, ఎట్టకేలకు అద్దంకి దయాకర్‌కు ఎమ్మెల్సీ సీటు, ముగ్గురు అభ్యర్ధుల్ని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ

Karnataka: రష్మిక మందన్నకు రక్షణ కల్పించాలి.. కాంగ్రెస్ ఎమ్మెల్యే రవి కుమార్ గౌడ వివాదాస్పద నేపథ్యంలో రష్మికకు మద్దతుగా కొడవ సమాజం

Advertisement
Advertisement
Share Now
Advertisement