Assam Assembly Election 2021: ప్రసంగాన్ని మధ్యలో ఆపేసిన ప్రధాని మోదీ, ముందు ఆ కార్యకర్తకు వైద్యం చేయాలని వైద్యులకు సూచన, మిలిటెంట్లు ఆయుధాలను వదిలిపెట్టి ప్రజాజీవితంలో కలిసి పోవాలని కోరిన ప్రధాని
తముల్పుర్లో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఓ సన్నివేశం చోటుచేసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ (Assam Assembly Election 2021) మాట్లాడుతూనే మధ్యలో ఒక్కసారిగా ప్రసంగాన్ని ఆపేశారు.
- Read in
- English
Baksa, April 3: ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ ఇవాళ అస్సాంలో పర్యటించారు. తముల్పుర్లో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఓ సన్నివేశం చోటుచేసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ (Assam Assembly Election 2021) మాట్లాడుతూనే మధ్యలో ఒక్కసారిగా ప్రసంగాన్ని ఆపేశారు. నేడు తమూల్పూర్ లో చివరి దశ ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన.. ఆ సభకు హాజరైన బీజేపీ కార్యకర్త ఒకరు కళ్లు తిరిగి పడిపోవడంతో ప్రసంగాన్ని (PM Narendra Modi Halts Speech in Assam) ఆపారు. అతడు కళ్లు తిరిగిపడిపోవడాన్ని సభకు వచ్చిన వారు ఎవరూ గమనించలేదు. అది తనకంట పడడంతో, ఆయన అందరినీ అప్రమత్తం చేశారు.
ఆయనకు వైద్యం చేయాలంటూ పీఎంవో వైద్య బృందాన్ని కోరారు. ‘నాతో పాటు వచ్చిన వైద్యులారా (పీఎంవో వైద్యులు).... దయచేసి ఆ కార్యకర్త వద్దకు వెళ్లండి. ఆయన డీహైడ్రేషన్తో బాధపడుతున్నారు. దయచేసి పరీక్షించండి. వెంటనే సహాయం (Sends PMO Medical Team to Check BJP Worker) చేయండి.’’ అని ప్రధాని మోదీ ఆదేశించారు.ప్రొటోకాల్ ప్రకారం, ప్రధానితో పాటు నలుగురు వైద్యుల బృందం వస్తుంటుంది. అన్ని రకాల వైద్య పరికరాలనూ, అత్యవసర ఔషధాలను వారు వెంట తీసుకొస్తారు.
Here's PM Speech Video
అందరి కోసం బీజేపీ పనిచేస్తుందని, కానీ, కొన్ని పార్టీలు కొందరి కోసమే పనిచేస్తాయని మోదీ ఈ సభలో ప్రసంగిస్తూ అన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం దేశాన్ని వారు విడగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. అందరి కోసం పనిచేసే పార్టీనేమో మతతత్వ పార్టీ అని, ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడే పార్టీలను లౌకిక పార్టీలంటూ పిలుస్తున్నారని, అది ఎంత వరకు కరెక్ట్? అని ఆయన ప్రశ్నించారు.
కేంద్రం, రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం.. అసోం అకార్డ్ (ఒప్పందం)ను పూర్తిగా అమలు చేసేందుకు కృషి చేస్తోందన్నారు. దానికి సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. అసోం ప్రజలు ఎన్డీయేకే ఓటేసేందుకు నిర్ణయించుకున్నారని అన్నారు. అసోం గుర్తింపును పోగొట్టి, హింసకు పాల్పడే పార్టీలను వారు సహించబోరని తేల్చి చెప్పారు.
హింసా మార్గంలో పయనిస్తున్న మిలిటెంట్లు.. ఆయుధాలను వదిలిపెట్టి ప్రజాజీవితంలో కలిసి పోవాలని మోదీ కోరారు. శాంతియుత ఆత్మనిర్భర్ అస్సాంను నిర్మించేందుకు కలిసి రావాలన్నారు. తల్లులు, సోదరీమణులకు హామీ ఇస్తున్నాని, మీ పిల్లలు ఆయుధాలు పట్టుకోరు అని, వాళ్లు తమ జీవితాలను అడవుల్లో గడపాల్సిన అవసరం లేదని, ఎటువంటి బుల్లెట్లకు నేలరాలవద్దు అని ఆయన అన్నారు.
అస్సాం ఐడెంటిటీని అవమానించేవారిని, హింసను ప్రోత్సహించేవారిని అస్సామీ ప్రజలు బహిష్కరిస్తారని కాంగ్రెస్ కూటమిని ఆయన విమర్శించారు. గత అయిదేళ్లలో బూపెన్ హజారికా సేతు, బోగిబీల్ బ్రిడజ్లను నిర్మించామని, మరో అరడజన బ్రిడ్జ్లు నిర్మాణంలో ఉన్నాయని, మేం ఏదైనా స్కీమ్ను రూపొందిస్తే, దాని ఫలితాలు అందరికీ అందేలా చూస్తామని, సబ్కా సాత్, సబ్కా వికాశ్ తమ నినాదమని ప్రధాని మోదీ అన్నారు.
Tags
సంబంధిత వార్తలు
India's GDP Grows 7.8 Percent: అంచనాలను మించి భారత జీడీపీ 8.2 శాతం వృద్ధి నమోదు, ఇదే జోరు కొనసాగితే 5 ట్రిలియన్ డాలర్లకు భారత ఆర్థిక వ్యవస్థ
Modi Meditates at Vivekananda Rock Memorial: సుదీర్ఘ ధ్యానంలో ప్రధాని మోదీ, వివేకానంద రాక్ మెమోరియల్ గార్డెన్ ప్రత్యేకత ఇదే! పార్వతీ దేవీ సహా పలువురు ధ్యానం చేసిన చోటు
Lok Sabha Elections 2024 Phase 7: రేపే ఆఖరి దశ పోలింగ్, మొత్తం 57 లోక్ సభ నియోజకవర్గాల్లో పోలింగ్, అదే రోజు సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ అంచనాలు విడుదల
PM Modi Remarks on Mahatma Gandhi: మహాత్మా గాంధీ భక్తులకు, గాడ్సే భక్తులకు మధ్య ఎన్నికలు, జాతిపితపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై విరుచుకుపడిన కాంగ్రెస్
Tejaswi Yadav on PK: ప్రశాంత్ కిషోర్ కు అన్ని డబ్బులెక్కడివి? బీజేపీ ఏజెంట్ గా పనిచేస్తున్నారంటూ మండిపడ్డ తేజస్వీ యాదవ్
Asaduddin Owaisi on POK: పీవోకేపై అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు, అది భారత్లో అంతర్భాగమే కాని బీజేపీ ఎన్నికల సమయంలోనే..
Voting BJP for 8 times: బీజేపీకి 8 సార్లు ఓటేసిన యూపీ యువకుడు.. వీడియో వైరల్.. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు.. పోలింగ్ బూత్ అధికారులందరినీ సస్పెండ్ చేస్తూ ఈసీ ఆదేశాలు (వీడియో ఇదిగో)
Arvind Kejriwal Challenges PM Modi: ప్రధాని మోదీకి కేజ్రీవాల్ సవాల్, రేపు బీజేపీ ఆఫీస్ కు వస్తా మీ ఇష్టం వచ్చినవాళ్లను అరెస్ట్ చేసుకోండి
తాజా వార్తలు
ట్రెండింగ్
SocialLY
Telangana Capital Hyderabad: హైదరాబాద్ తో ఏపీకి తెగిన బంధం.. ఇకపై తెలంగాణకు శాశ్వత రాజధానిగా భాగ్యనగరం.. పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా కొనసాగిన హైదరాబాద్.. నిన్నటితో ముగిసిన గడువు
2024 ICC T20 Men's T20 World Cup Google Doodle: 2024 ICC పురుషుల T20 ప్రపంచ కప్ సమరం మొదలైంది, ప్రత్యేకమైన డూడుల్తో అలరించిన గూగుల్
Poll Strategy Group Exit Poll: అధికార వైసీపీకే జైకొట్టిన పోల్ స్ట్రాటజీ గ్రూప్, 115 నుంచి 125 సీట్లతో జగన్ మళ్లీ అధికారంలోకి, 50 నుంచి 60 సీట్ల మధ్యలో టీడీపీ
Janagalam Exit Poll: టీడీపీ కూటమికే జై కొట్టిన జనగళం ఎగ్జిట్ పోల్ సర్వే , 104 నుంచి 118 సీట్లతో అధికారంలోకి, 44 నుంచి 57 సీట్ల మధ్యలో వైసీపీ