Rahul Gandhi Video Conference: కరోనా నియంత్రణకు లాక్‌డౌన్‌ ఒక్కటే పరిష్కారం కాదు, అన్నీ పార్టీలతో కలిసి పనిచేయాలి, మీడియాతో కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ రాహుల్‌ గాంధీ

దేశంలో కరోనా మహమ్మారిని అరికట్టడానికి లాక్‌డౌన్‌ (Lockdown) ఒక్కటే పరిష్కారం కాదని కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ రాహుల్‌ గాంధీ (Congress MP Rahul Gandhi )అన్నారు. ప్రస్తుతం విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్నామని, ప్రజలతోపాటూ అన్నీ పార్టీలతో అధికార పార్టీ కలిసి పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. లాక్‌డౌన్‌ కేవలం కరోనా వ్యాప్తిని మాత్రమే అడ్డుకుంటుందని, ఆ తర్వాత మళ్లీ విజృంభించే అవకాశం లేకపోలేదన్నారు.

Rahul Gandhi video conference with media (Photo Credits: INC India)

New Delhi, April 16: దేశంలో కరోనా మహమ్మారిని అరికట్టడానికి లాక్‌డౌన్‌ (Lockdown) ఒక్కటే పరిష్కారం కాదని కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ రాహుల్‌ గాంధీ (Congress MP Rahul Gandhi )అన్నారు. ప్రస్తుతం విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్నామని, ప్రజలతోపాటూ అన్నీ పార్టీలతో అధికార పార్టీ కలిసి పని చేయాల్సిన అవసరం ఉందన్నారు.

పిజ్జా డెలివరీ బాయ్‌కి కరోనావైరస్, హోమ్ క్వారంటైన్‌లోకి 72 కుటుంబాలు

లాక్‌డౌన్‌ కేవలం కరోనా వ్యాప్తిని మాత్రమే అడ్డుకుంటుందని, ఆ తర్వాత మళ్లీ విజృంభించే అవకాశం లేకపోలేదన్నారు. ఢిల్లీలోని (Delhi) కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యాలయంలో గురువారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ (Rahul Gandhi Video Conference) ద్వారా మీడియాతో మాట్లాడారు.

కరోనావైరస్ ( Coronavirus) పై పోరాటానికి వైద్య పరీక్షలు భారీగా పెంచాలని రాహుల్‌ గాంధీ అన్నారు. వయనాడ్‌లో కరోనా నియంత్రణ సమర్థంగా జరుగుతోందని, కరోనాపై పోరులో కేరళ తీసుకున్న జాగ్రత్తలు అన్ని చోట్లా తీసుకోవాలని సూచించారు. రోజువారీ కూలీలు, కార్మికులు ఉపాధిలేక ఇబ్బంది పడుతున్నారని, వారిని ఆదుకోవడానికి ప్రణాళికలు రూపొందిచాలని తెలిపారు. కరోనాపై పోరులో అందుబాటులో ఉన్న వనరులన్నీ వినియోగించుకోవాలని, ఇతర ప్రాంతాల్లో చిక్కుకున్న వారికి ఆహారం అందించాలని పేర్కొన్నారు.

మంటగలుస్తోన్న మానవత్వం, పేషెంట్ ఆటోని నిలిపివేసిన పోలీసులు

కాంగ్రెస్ ప్రతిపాదించిన NYAY పథకం వంటి కనీస ఆర్థిక వలయాన్ని ప్రభుత్వం సిద్ధం చేయాలని వయనాడ్ ఎంపి అన్నారు. "మీరు దీనిని NYAY పథకం అని పిలవవలసిన అవసరం లేదు" అని ఆయన వ్యాఖ్యానించారు. "దీనిని విమర్శగా భావించవద్దు" అని ఆయన అన్నారు. "నేను గతంలోకి వెళ్ళడానికి ఇష్టపడను. మనం కలిసి ఐక్యంగా పోరాడాలి, ఈ సమయంలో నిందలు మంచిది కాదు. బదులుగా, మన వనరులను జాగ్రత్తగా ఉపయోగించుకుందాం మరియు డబ్బును రాష్ట్రాలు మరియు జిల్లాలకు ఇద్దాం" అని ఆయన అన్నారు.

లాక్‌డౌన్‌ పొడిగింపు నేపథ్యంలో పేదలకు తక్షణమే రేషన్‌ కార్డులు జారీ చేసి వారిని ఆదుకోవాలని కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ రాహుల్‌ గాంధీ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. పేదలందరికీ ఉచితంగా రేషన్‌ అందేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ‘‘ కరోనా సంక్షోభంలో లాక్‌డౌన్‌ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రతీ ఒక్కరికీ అ‍త్యవసరంగా రేషన్‌ కార్డులు జారీ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. రేషన్‌కార్డు లేని వాళ్లకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందడం లేదు. ఎన్నో ఖాళీ కడుపులు ఆహారం కోసం వేచి చూస్తుంటే.... ధాన్యాలన్నీ గోదాముల్లోనే నిలిచిపోయాయి. అమానుషం’’అని ట్విటర్‌ వేదికగా ప్రభుత్వాన్ని విమర్శించారు.

కరోనావైరస్ మహమ్మారి మరియు తదుపరి లాక్డౌన్ కారణంగా "నిరుద్యోగం " మరియు "ఆర్థిక వ్యవస్థపై భారీ ఒత్తిడి"ని కూడా రాహుల్ గాంధీ అంచనా వేశారు. "డబ్బును వ్యూహాత్మకంగా ఉపయోగించుకోవాలని మరియు నిర్మాణాన్ని నిర్వహించాలని నేను ప్రభుత్వానికి సూచిస్తాను. ప్రజల రక్షణ కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేయాలి" అని ఆయన అన్నారు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Accident Averted at Hyderabad Airport: వీడియో ఇదిగో, శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో విమానానికి తప్పిన పెను ప్రమాదం, 150 మంది ప్రయాణికులు సేఫ్

MLC Candidates: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ టికెట్ దాసోజు శ్రవణ్ కు.. కాంగ్రెస్ అభ్యర్ధులుగా అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు

Congress MLC Candidates: మరోసారి చట్టసభల్లోకి రాములమ్మ, ఎట్టకేలకు అద్దంకి దయాకర్‌కు ఎమ్మెల్సీ సీటు, ముగ్గురు అభ్యర్ధుల్ని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ

Karnataka: రష్మిక మందన్నకు రక్షణ కల్పించాలి.. కాంగ్రెస్ ఎమ్మెల్యే రవి కుమార్ గౌడ వివాదాస్పద నేపథ్యంలో రష్మికకు మద్దతుగా కొడవ సమాజం

Advertisement
Advertisement
Share Now
Advertisement