Arvind Kejriwal: అరవింద్‌ కేజ్రీవాల్‌ బెయిల్‌ పై మరికొద్దిసేపట్లో సుప్రీంకోర్టు తీర్పు.. సర్వత్రా ఆసక్తి

మద్యం పాలసీ కేసులో అరెస్టై, జైలు శిక్ష అనుభవిస్తున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ దాఖలు చేసిన రెండు పిటిషన్లపై సుప్రీంకోర్టు మరికొద్దిసేపట్లో తీర్పు వెలువరించనుంది.

kejriwal(X)

Newdelhi, Sep 13: మద్యం పాలసీ కేసులో (Delhi excise policy case) అరెస్టై, జైలు శిక్ష అనుభవిస్తున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) దాఖలు చేసిన రెండు పిటిషన్లపై సుప్రీంకోర్టు మరికొద్దిసేపట్లో తీర్పు వెలువరించనుంది. సీబీఐ (CBI) నమోదు చేసిన అవినీతి కేసులో తన అరెస్టును, ఢిల్లీ హైకోర్టు తనకు బెయిల్ ఇవ్వడాన్ని నిరాకరిస్తూ సవాల్‌ చేస్తూ కేజ్రీవాల్‌ ఈ రెండు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ రెండు పిటిషన్లపైనా జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు వెలువరించనుంది. అయితే, ఈ నెల 5న కేజ్రీవాల్ పిటిషన్‌ పై విచారించిన ధర్మాసనం తీర్పును రిజర్వ్‌ లో ఉంచిన విషయం తెలిసిందే. తాజాగా ఆ తీర్పును కోర్టు వెలువరించనున్నది.

తనపై హత్యాయత్నం జరిగింది, దాడి చేసిన వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదన్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి..వీడియో

అలా అయితే, బయటకే

మద్యం పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్‌ ను ఈడీ అరెస్టు చేసింది.  ఈడీ నమోదు చేసిన కేసులో ఆయనకు సుప్రీంకోర్టు ఇట్టేవలె బెయిల్‌ మంజూరు చేసిన విషయం తెలిసిందే. కాగా, జూన్ 26న ఈ మద్యం కేసులోనే కేజ్రీని సీబీఐ కూడా అరెస్ట్ చేసింది. దీంతో సీబీఐ కేసులో నేడు బెయిల్ వస్తే, కేజ్రీవాల్ బయటకు వచ్చినట్టేనని విశ్లేషకులు చెప్తున్నారు.

టాలీవుడ్ లో విషాదం.. ‘ముద్దబంతి నవ్వులో మూగబాసలు..’ వంటి హిట్‌ సాంగ్స్ అందించిన పాటల రచయిత గురు చరణ్‌ ఇకలేరు

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్‌ పై విచారణ 12కి వాయిదా

Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్

Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..

Viveka Murder Case: జగన్‌ కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలని పదే పదే చెప్పా, వాచ్‌మెన్ రంగన్న మృతిపై అనుమానాలున్నాయంటూ చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

Advertisement
Advertisement
Share Now
Advertisement