Cancer Tablet in Rs 100: వంద రూపాయలకే క్యాన్సర్ టాబ్లెట్, క్యాన్సర్ తిరిగి రాకుండా నిరోధించే చికిత్స ట్రయల్స్ సక్సెస్ అని ప్రకటించిన ముంబై టాటా ఇన్స్టిట్యూట్
ఈ చికిత్సలో భాగంగా క్యాన్సర్ టాబ్లెట్ను రూపొందించినట్లు టాటా మెమోరియల్ హాస్పిటల్ సీనియర్ క్యాన్సర్ సర్జన్ డాక్టర్ రాజేంద్ర బద్వే వెల్లడించారు. ట్యాబ్లెట్ విలువ కేవలం రూ.100 మాత్రమేనని (Cancer Tablet in Rs 100) తెలిపారు.
ముంబైలోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ రీసెర్చ్ మహమ్మారిపై ఓ కీలక ప్రకటన చేసింది. క్యాన్సర్ తిరిగి రాకుండా నిరోధించే చికిత్సను సక్సెస్ ఫుల్ గా కనుగొన్నట్లు తెలిపింది. ఈ చికిత్సలో భాగంగా క్యాన్సర్ టాబ్లెట్ను రూపొందించినట్లు టాటా మెమోరియల్ హాస్పిటల్ సీనియర్ క్యాన్సర్ సర్జన్ డాక్టర్ రాజేంద్ర బద్వే వెల్లడించారు. ట్యాబ్లెట్ విలువ కేవలం రూ.100 మాత్రమేనని (Cancer Tablet in Rs 100) తెలిపారు.
ఇన్స్టిట్యూట్లోని పరిశోధకులు, వైద్యుల 10 సంవత్సరాల కృషి ఫలితంగా ఈ విజయం దక్కింది. ఈ టాబ్లెట్ రోగులలో క్యాన్సర్ రెండవ రకం కారకాన్ని నిరోధిస్తుందని (Tata Institute Claims New Breakthrough in Cancer Prevention) పేర్కొన్నారు. రేడియేషన్, కీమోథెరపీ వంటి చికిత్సల వల్ల వచ్చే దుష్ప్రభావాలను 50 శాతం తగ్గించే సామర్థ్యం ఈ టాబ్లెట్కు ఉందని డాక్టర్ రాజేంద్ర బద్వే వివరించారు.
ఈ పరిశోధన కోసం శాస్త్రవేత్తలు ఎలుకలలో మానవ క్యాన్సర్ కణాలను ప్రవేశపెట్టారు. దాంతో ఎలుకల్లో క్యాన్సర్ కణితి ఏర్పడింది. ఆ తర్వాత ఎలుకలకు రేడియేషన్ థెరపీ, కీమోథెరపీ, సర్జరీతో చికిత్స అందించారు. ఈ చికిత్సలో క్యాన్సర్ కణాలు చనిపోయి ‘క్రోమాటిన్ కణాలు’ అని పిలిచే చిన్న ముక్కలుగా విడిపోయాయని గుర్తించారు. ఈ చిన్న కణాలు రక్తం ద్వారా శరీరంలోని ఇతర భాగాలకు ప్రయాణించే అవకాశం ఉంటుంది. ఆరోగ్యకరమైన కణాలలోకి ప్రవేశిస్తే మళ్లీ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది.
రెండవసారి క్యాన్సర్ వచ్చే అవకాశాలను నిరోధించేందుకు వైద్యులు ఎలుకలకు రెస్వెరాట్రాల్, కాపర్ (R+Cu) కలిగిన ప్రో-ఆక్సిడెంట్ మాత్రలు ఇచ్చారు. కాపర్ (R+Cu) ఆక్సిజన్ రాడికల్లను ఉత్పత్తి చేస్తుంది. క్రోమాటిన్ కణాలను నాశనం చేస్తుందని రాజేంద్ర బద్వే వివరించారు. రెండో సారి క్యాన్సర్ను నివారించడంలో ఈ టాబ్లెట్ 30 శాతం ప్రభావవంతంగా పనిచేస్తుందని, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుండి అనుమతి కోసం ఎదురుచూస్తున్నామని ఆయన చెప్పారు. జూన్-జూలై నుంచి మార్కెట్లోకి వచ్చే అవకాశాలున్నాయని చెబుతున్నారు.
ప్రయోగాలలో ఏ టాటా ఇన్స్టిట్యూట్ బృందం కనుగొనబడింది?
ఈ బృందం మానవ రొమ్ము క్యాన్సర్ కణాలతో ఎలుకలపై ప్రయోగాలు చేసింది మరియు ఔషధం క్రోమాటిన్ను సమర్థవంతంగా నాశనం చేసి, మెటాస్టాసిస్ను నివారిస్తుందని కనుగొన్నారు. ఔషధం యొక్క సమర్థత, భద్రతను పరీక్షించడానికి మానవ పరీక్షలను నిర్వహించాలని బృందం యోచిస్తోంది.
మనం మార్కెట్లో టాబ్లెట్లను ఎప్పుడు చూడగలం?
పరిశోధక బృందం టాబ్లెట్పై 10 సంవత్సరాలు పనిచేసింది. దానిని "Magic of R+Cu" అని పిలిచారు. జూన్-జూలై నాటికి ఈ టాబ్లెట్ను మార్కెట్లోకి విడుదల చేయడానికి టీమ్ ఇప్పుడు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) నుండి అనుమతి కోసం వేచి ఉంది.
ముఖ్యంగా ప్యాంక్రియాటిక్, ఊపిరితిత్తులు, నోటి క్యాన్సర్తో బాధపడుతున్న క్యాన్సర్ రోగుల జీవన నాణ్యత, మనుగడ రేటును ఈ టాబ్లెట్ మెరుగుపరుస్తుందని డాక్టర్ బద్వే చెప్పారు. ఖరీదైన కేన్సర్ చికిత్సలకు భిన్నంగా అందరికీ అందుబాటులో ఉండేలా ఈ ట్యాబ్లెట్ అందుబాటులోకి వస్తుందన్నారు. టాబ్లెట్ నివారణ ప్రభావం కోసం మానవ పరీక్షలు పూర్తి కావడానికి మరో ఐదేళ్లు పడుతుందని కూడా ఆయన చెప్పారు.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)