Chile News: ఉద్యోగికి జీతం 50 వేలు, అయితే రూ.1.42 కోట్లు జీతంగా చెల్లించిన కంపెనీ, బిత్తరపోయి కంపెనీకి రాజీనామా చేసి పరారయిన ఉద్యోగి

ఇటీవల వేతనాల చెల్లి​ంపు సందర్భంగా ఓ ఉద్యోగికి (Cial Employee) 500,000 పేసోలు (రూ.50 వేలు) చెల్లించాల్సి ఉంది. అయితే అకౌంట్స్‌ విభాగం చేసిన తప్పుల కారణంగా ఏకంగా 165,398,851 పేసోలు (రూ.1.42 కోట్లు) జీతంగా ఆ ఉద్యోగి ఖాతాలో పడ్డాయి.

Mobile (Photo Credit: File)

దక్షిణ అమెరికా ఖండంలో చిలీ దేశంలో కన్సార్సియో ఇండస్ట్రియల్‌ డే అలిమెంటోస్‌ అనే ప్రముఖ మైనింగ్‌ సంస్థ ఉంది. ఈ కంపెనీలో వేలాది మంది కార్మికులు వందలాది మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. ఇటీవల వేతనాల చెల్లి​ంపు సందర్భంగా ఓ ఉద్యోగికి (Cial Employee) 500,000 పేసోలు (రూ.50 వేలు) చెల్లించాల్సి ఉంది. అయితే అకౌంట్స్‌ విభాగం చేసిన తప్పుల కారణంగా ఏకంగా 165,398,851 పేసోలు (రూ.1.42 కోట్లు) జీతంగా ఆ ఉద్యోగి ఖాతాలో పడ్డాయి.

ప్రతీ నెల తనకు వచ్చే జీతం కంటే 286 రెట్లు (accidentally gets paid 286 times) ఎక్కువగా వేతనం జమ కావడంతో ఒక్కసారిగా ఆ ఉద్యోగి పరేషాన్‌ అయ్యాడు. వెంటనే అకౌంట్స్‌ విభాగాన్ని సంప్రదించి తనకు 286 రెట్లు అధికంగా జీత పడిందంటూ తెలిపాడు. వెంటనే రికార్డులు పరిశీలించిన అకౌంట్స్‌ విభాగం తప్పును గుర్తించింది. అధికంగా జమ అయిన సొమ్మును వెంటనే కంపెనీ ఖాతాకు పంపాలంటూ కోరింది. మరుసటి రోజు మైనింగ్‌ కంపెనీ అధికారులు ఉద్యోగికి ఫోన్‌ చేసి అధికంగా పడిన సొమ్ము గురించి వాకాబు చేశారు. ఎక్కువ సమయం నిద్ర పోవడం వల్ల బ్యాంకుకి వెళ్లడం వీలు పడలేదని. కాసేపట్లో బ్యాంకుకు వెళ్తానంటూ వారికి సమాధానం ఇచ్చాడు. కానీ అదే రోజు అతను బ్యాంకుకు వెళ్లకుండా హెచ్‌ఆర్‌ డిపార్ట్‌మెంట్‌కి వెళ్లి తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు.

షాకింగ్ వీడియో, స్కూటర్ మీద వెళుతున్న మహిళపై దబ్బున పడిన కొబ్బరికాయ, ఒక్కసారిగా కిందపడిపోయిన మహిళ, తప్పిన ప్రాణాపాయం, వీడియో వైరల్

రెండు రోజులైన ఉద్యోగికి చెల్లించిన అధిక మొత్తం డబ్బులు తిరిగి కంపెనీ ఖాతాలో జమ కాకపోవడంతో మరోసారి సదరు ఉద్యోగితో టచ్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు అకౌంట్స్‌ సిబ్బంది. కానీ ఫోన్‌, మెసేజ్‌లకు అతను అందుబాటులోకి రాలేదు. ఇంటికి వెళ్లి చూడగా అతను అక్కడ లేడు. మరోవైపు ఆఫీసులు రిజైన్‌ లెటర్‌ ఇచ్చినట్టు తెలిసింది. యాభై వేల రూపాయల బదులు ఒక కోటి నలభైమూడు లక్షల రూపాయల సొమ్మును అందుకున్న సదరు వ్యక్తి తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ఆ సొమ్ముతో ఊరొదిలి రహస్య ప్రాంతాలకు చేరుకున్నాడు. అకౌంట్స్ డిపార్ట్ మెంట్ చేసిన చిన్న పొరపాటు కంపెనీకి ఇంత నష్టాన్ని మిగిల్చింది.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

CM Revanth Reddy: రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే దేశం అభివృద్ధి చెందుతుంది, సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు, కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి వల్లే రాష్ట్రానికి ప్రాజెక్టులు రావడంలేదని మండిపాటు

Telangana: హైదరాబాద్-బెంగళూరును డిఫెన్స్ ఇండస్ట్రీయల్ కారిడార్‌‌గా ప్రకటించండి, రక్షణమంత్రి రాజనాథ్ సింగ్‌ను కోరిన సీఎం రేవంత్ రెడ్డి

Telangana: బొట్టు పెట్టి పెళ్లి అయిందని నమ్మించి యువతిని మోసం చేసిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. ఏకంగా ఫ్లాట్ అద్దెకు తీసుకుని మరి అరాచకం, వివరాలివే

West Bengal Shocker: సెలవు ఇవ్వలేదని సహోద్యోగులను కత్తితో పొడిచి చంపిన ఉద్యోగి, ర‌క్తపై మ‌ర‌క‌లు అంటిన కత్తితో రోడ్డుపై న‌డుచుకుంటూ హల్ చల్

Advertisement
Advertisement
Share Now
Advertisement