Aishwarya Rai: చేపలు తింటే ఐశ్వర్య రాయ్ లాంటి కళ్లు వస్తాయ్.. మహారాష్ట్ర మంత్రి విజయ్కుమార్ గవిత్ సంచలన వ్యాఖ్యలు.. సముద్ర తీరంలో ఉండే చేపలు తినే ఐశ్వర్య అందమైన కళ్లు సొంతం చేసుకుందని వెల్లడి
మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ (Aishwarya Rai) అందమైన నీలి కళ్ల సౌందర్యానికి ఫిదా కానివారెవరూ? ఇప్పుడు ఆమె కళ్లపై మహారాష్ట్ర (Maharastra) గిరిజన శాఖ మంత్రి విజయ్కుమార్ గవిత్ (Vijaykumar Gavit) సంచలన వ్యాఖ్యలు చేశారు.
Newdelhi, Aug 22: మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ (Aishwarya Rai) అందమైన నీలి కళ్ల సౌందర్యానికి ఫిదా కానివారెవరూ? ఇప్పుడు ఆమె కళ్లపై మహారాష్ట్ర (Maharastra) గిరిజన శాఖ మంత్రి విజయ్కుమార్ గవిత్ (Vijaykumar Gavit) సంచలన వ్యాఖ్యలు చేశారు. రోజూ చేపలు తినేవారికి ఐశ్వర్యలాంటి సొంతమవుతాయని గవిత్ వ్యాఖ్యానించారు. నందూర్బార్ జిల్లాలో ఓ బహిరంగ సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ఉదంతం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. ‘రోజూ చేపలు తినేవారి చర్మం నునుపుగా ఉంటుంది. కళ్లు మెరుస్తుంటాయి. అలాంటి వారిని చూసే వారు ఆకర్షణకు లోనవుతారు. నేను ఐశ్వర్యరాయ్ గురించి చెప్పనా? ఆమె మంగళూరులోని సముద్ర తీరంలో నివసించేది. దీంతో, రోజూ చేపలు తినేది. చేపలు తింటే అలాంటి కళ్లు మీ సొంతమవుతాయి’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
Advertisement
సంబంధిత వార్తలు
Sankranthiki Vasthunnam Movie Review in Telugu: సంక్రాంతికి వస్తున్నాం మూవీ రివ్యూ ఇదిగో, మరోసారి వెంకి మామ కామెడీ అదుర్స్, ప్రేక్షకులకు కావాల్సినంత కామెడీ
Chennai Court Grants Divorce To Dhanush and Aishwarya: ఎట్టకేలకు ఆ స్టార్ కపుల్ కు విడాకులు మంజూరు, 18 ఏళ్ల వివాహ బంధానికి చట్టపరంగా తెర
Delhi Air Pollution: ఢిల్లీలో తారాస్థాయికి చేరిన కాలుష్యం, అన్ని స్కూళ్లు మూసివేత, సోమవారం నుంచి తీవ్రమైన ఆంక్షలు..
IIFA Utsavam Awards 2024: IIFA ఉత్సవం అవార్డ్స్ 2024, దక్షిణాది భాషల్లో ఎప్పుడు, ఎక్కడ ప్రసారం అవుతుందంటే..
Advertisement
Advertisement
Advertisement