Special Trains For Summer: వేసవి కోసం రైల్వే ప్రత్యేక ఏర్పాట్లు.. 380 ప్రత్యేక రైళ్లు సిద్ధం.. దేశంలోని ప్రధాన కేంద్రాల మీదుగా 6,369 ట్రిప్పుల నిర్వహణకు నిర్ణయం

వేసవిలో ప్రయాణాలు, టూర్స్, ప్రయాణికుల రద్దీని తట్టుకునేందుకు రైల్వే శాఖ ఎప్పటిలాగే ప్రత్యేక రైళ్లను నడిపేందుకు నిర్ణయించింది. మొత్తం 380 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ పేర్కొంది.

Credits: ANI

Newdelhi, May 20: వేసవిలో ప్రయాణాలు (Summer Trips), టూర్స్ (Tours), ప్రయాణికుల రద్దీని తట్టుకునేందుకు రైల్వే శాఖ (Railway) ఎప్పటిలాగే ప్రత్యేక రైళ్లను (Special Trains) నడిపేందుకు నిర్ణయించింది. మొత్తం 380 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ (Railway Ministry) పేర్కొంది. పాట్నా, ఢిల్లీ, విశాఖపట్నం, ముంబై వంటి ప్రధాన కేంద్రాల మీదుగా మొత్తం 6,369 రైళ్ల ట్రిప్పులు నిర్వహించేందుకు నిర్ణయించింది. రైల్వే శాఖ గతేడాది 348 ప్రత్యేక రైళ్లతో ప్రయాణికుల సౌకర్యార్థం మొత్తం 4,599 ట్రిప్పులను నిర్వహించింది. ఈ ఏడాది అదనంగా మరో 1,770 ట్రిప్పులను జోడించింది. ఈ ప్రత్యేక సర్వీసులు పాట్నా-యశ్వంత్‌పూర్, పాట్నా-సికింద్రాబాద్, విశాఖపట్నం-పూరీ-హావ్డా తదితర మార్గాల్లో నడపనున్నారు.

Toor Dal Price Hike: దేశంలో కందిపప్పు కొరత.. కొండెక్కిన ధర.. దుకాణాల్లో దర్శనమిస్తున్న నోస్టాక్ బోర్డులు.. ప్రస్తుతం కిలో కందిపప్పును రూ. 140కి విక్రయిస్తున్న వైనం

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement