TS Rain Alert: తెలంగాణలో రేపటి నుంచి నాలుగు రోజులు వానలు.. పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ జారీ!

తెలంగాణలో రేపటి నుంచి రాగల నాలుగు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాపాతం నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

Rain in Hyderabad (Credits: X)

Hyderabad, Apr 21: తెలంగాణలో (Telangana) రేపటి నుంచి రాగల నాలుగు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాపాతం (Rains) నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. నల్గొండ, సూర్యాపేట, వరంగల్‌, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌, సంగారెడ్డి, ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి జిల్లాల్లో అక్కడక్కడ వానలు కురిసే అవకాశం ఉందని వివరించింది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.

Rain in Hyderabad (Credits: X)
Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement