Tirumala: తిరుమల కొండపై మళ్లీ పెరిగిన భక్తుల రద్దీ.. స్వామివారి సర్వదర్శనానికి 24 గంటల సమయం.. భక్తులతో నిండిపోయిన వైకుంఠం క్యూ కాంప్లెక్స్

గత కొన్నిరోజులుగా తిరుమలలో తక్కువగా నమోదైన భక్తుల తాకిడి ఇప్పుడు మళ్ళీ పెరిగింది. తొలి ఏకాదశి కావడం, వీకెండ్ కూడా రావడంతో భక్తులు తిరుమలకు పోటెత్తారు. దీంతో శ్రీవారి సన్నిధిలో భక్తుల రద్దీ మళ్లీ పెరిగింది.

Credits: Twitter

Tirumala, July 1: గత కొన్నిరోజులుగా తిరుమలలో (Tirumala) తక్కువగా నమోదైన భక్తుల (Devotees) తాకిడి ఇప్పుడు మళ్ళీ పెరిగింది. తొలి ఏకాదశి కావడం, వీకెండ్ (Weekend) కూడా రావడంతో భక్తులు తిరుమలకు పోటెత్తారు. దీంతో  శ్రీవారి సన్నిధిలో భక్తుల రద్దీ మళ్లీ పెరిగింది. టోకెన్లు (Tokens) లేకుండా క్యూలైన్లలోకి వచ్చిన భక్తులకు స్వామివారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కంపార్ట్ మెంట్లు అన్ని నిండిపోయి, భక్తులు శిలాతోరణం వరకు క్యూలైన్లలో ఉన్నారు. నిన్న తిరుమల వెంకన్నను 62,005 మంది భక్తులు దర్శించుకోగా, 34,127 మంది తలనీలాల మొక్కు తీర్చుకున్నారు. నిన్న ఒక్క రోజే స్వామివారికి హుండీ ద్వారా రూ.3.75 కోట్ల ఆదాయం వచ్చింది.

Bandi Sanjay: తెలంగాణ రాష్ట్ర బీజేపీలో భారీ మార్పులకు శ్రీకారం.. కిషన్‌రెడ్డికి పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఇస్తారా? మరి బండి సంజయ్ పరిస్థితి??

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement