Another Pee-Gate: పీకలదాకా మద్యం తాగి ప్రయాణికులపై మూత్ర విసర్జన చేసిన యువకుడు, యూపీ సంపర్క్‌ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో దారుణ ఘటన వెలుగులోకి..

ఉత్తరప్రదేశ్‌లో సంపర్క్‌ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో ఓ యువకుడు మద్యం మత్తులో తోటి ప్రయాణికులపై మూత్ర విసర్జన చేశాడు. పీకలదాకా మద్యం తాగి తోటి ప్రయాణికులైన ఓ వృద్ధ దంపతులపై మూత్రవిసర్జనకు పాల్పడ్డాడు.దారుణ ఘటనను గమనించిన తోటి ప్రయాణికులు వెంటనే కోచ్‌ అటెండెంట్‌, టీటీఈకి సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి దంపతులకు సాయం చేశారు.

Representational Image | (Photo Credits: IANS)

ఉత్తరప్రదేశ్‌లో సంపర్క్‌ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో ఓ యువకుడు మద్యం మత్తులో తోటి ప్రయాణికులపై మూత్ర విసర్జన చేశాడు. పీకలదాకా మద్యం తాగి తోటి ప్రయాణికులైన ఓ వృద్ధ దంపతులపై మూత్రవిసర్జనకు పాల్పడ్డాడు.దారుణ ఘటనను గమనించిన తోటి ప్రయాణికులు వెంటనే కోచ్‌ అటెండెంట్‌, టీటీఈకి సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి దంపతులకు సాయం చేశారు. అనంతరం.. ఘటనకు పాల్పడిన నిందితుడిని పట్టుకుని ఝాన్సీ రైల్వే స్టేషన్‌లో రైల్వే పోలీసులకు అప్పగించారు. కాగా, నిందితుడిని ఢిల్లీకి చెందిన రితేశ్‌గా గుర్తించారు. మహోబాలో రైలెక్కిన అతడు అప్పటికే మద్యం తాగి ఉన్నాడని తోటి ప్రయాణికులు తెలిపారు. రితేశ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం అతడిని బెయిల్‌పై విడుదల చేసినట్లు పోలీసులు తెలిపారు.

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement