Apollo JMD Sangita Reddy: అపోలో జేఎండీ సంగీతారెడ్డికి కరోనా, కాక్టెయిల్, రీజెనెరాన్ థెరపీ ద్వారా కోలుకుంటున్నానని తెలిపిన సంగీత,అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని ట్విట్టర్ ద్వారా పిలుపు
అపోలో జేఎండీ సంగీతారెడ్డికి రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కరోనావైరస్ సోకింది. జూన్ 10న తాను కోవిడ్-19 బారిన పడ్డానని, వ్యాక్సిన్ తీసుకుని.. ఎన్ని జాగ్రత్తలు పాటించినా తనకు కరోనా సోకడం షాక్కు గురి చేసిందని సంగీతారెడ్డి ట్వీట్ చేశారు.
అపోలో జేఎండీ సంగీతారెడ్డికి రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కరోనావైరస్ సోకింది. జూన్ 10న తాను కోవిడ్-19 బారిన పడ్డానని, వ్యాక్సిన్ తీసుకుని.. ఎన్ని జాగ్రత్తలు పాటించినా తనకు కరోనా సోకడం షాక్కు గురి చేసిందని సంగీతారెడ్డి ట్వీట్ చేశారు. వ్యాధినిర్ధారణ, చికిత్స రెండూ కీలకమైన అంశాలని తెలిపారు. కరోనా వల్ల విపరీతమైన జ్వరం రావడంతో ఆస్పత్రిలో చేరానని ఆమె తెలిపారు. అయితే కాక్టెయిల్, రీజెనెరాన్ థెరపీద్వారా కోలుకుంటున్నాను అన్నారు. వ్యాక్సిన్ కరోనాను అడ్డుకోలేదు...కానీ వైరస్ ప్రభావం తీవ్రం కాకుండా నిరోధిస్తుందని సంగీతారెడ్డి తెలిపారు. అందువల్ల వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా జాగ్రత్తలు మరవొద్దు అని ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా తనకు అండగా నిలిచిన డాక్టర్లు, నర్సులకు కృతజ్ఞతలు తెలిపారు.
Advertisement
సంబంధిత వార్తలు
CM Revanth Reddy: ఆత్మగౌరవంలోనే కాదు.. త్యాగంలోనూ పద్మశాలీలు ముందుంటారు, సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు, ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెడుతున్నట్లు ప్రకటన
Telangana Assembly Sessions: 12 నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. 18న లేదా 19న రాష్ట్ర బడ్జెట్, ఈసారైనా అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ వచ్చేనా!
Teegala Krishna Reddy: మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ఇంట విషాదం.. రోడ్డు ప్రమాదంలో దుర్మరణంపాలైన తీగల మనవడు కనిష్క్ రెడ్డి
Revanth Reddy Delhi Tour: ఢిల్లీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులపై అధిష్టానంతో చర్చ,ఇండియా టుడే కాంక్లేవ్లో పాల్గొననున్న రేవంత్
Advertisement
Advertisement
Advertisement