Election Results 2022: ఈవీఎం ట్యాంపరింగ్ అనే సమస్యే లేదు, ఎన్నికల సంఘం ఏ రాజకీయ పార్టీ తొత్తు కాదు. ప్రతి రాజకీయ పార్టీ సమానమే, ఈవీఎం ట్యాంపరింగ్ ఆరోపణలపై స్పందించిన సీఈసీ సుశీల్ చంద్ర
ఈవీఎం ట్యాంపరింగ్ ఆరోపణలపైనా సీఈసీ స్పందించారు. ఈవీఎం ట్యాంపరింగ్ అనే సమస్యే లేదు. 2004 నుండి EVMలు నిరంతరం ఉపయోగించబడుతున్నాయి. 2019 నుండి మేము ప్రతి పోలింగ్ బూత్లో VVPATని ఉపయోగించడం ప్రారంభించాము. రాజకీయ పార్టీల ఏజెంట్ల సమక్షంలో ఈవీఎంలకు సీల్ వేశారని తెలిపారు.
ఈవీఎం ట్యాంపరింగ్ ఆరోపణలపైనా సీఈసీ స్పందించారు. ఈవీఎం ట్యాంపరింగ్ అనే సమస్యే లేదు. 2004 నుండి EVMలు నిరంతరం ఉపయోగించబడుతున్నాయి. 2019 నుండి మేము ప్రతి పోలింగ్ బూత్లో VVPATని ఉపయోగించడం ప్రారంభించాము. రాజకీయ పార్టీల ఏజెంట్ల సమక్షంలో ఈవీఎంలకు సీల్ వేశారని తెలిపారు. యూపీలో ఈవీ ట్యాంపరింగ్ ఆరోపణలపైనా సీఈసీ వివరణ ఇచ్చారు. స్ట్రాంగ్రూమ్ నుంచి ఓట్లు వేసిన ఏ ఈవీఎంను బయటకు తీయలేరు. కొన్ని పార్టీలు ప్రశ్నలు లేవనెత్తాయి. మేం ఇచ్చిన వివరణతో ఆ పార్టీల వాళ్లు సంతృప్తి చెందారు. వారణాసిలోని ఈవీఎంలపై లేవనెత్తిన ప్రశ్నలు శిక్షణ నిమిత్తం ఉద్దేశించబడ్డాయని తెలిపారు.
ఎన్నికల సంఘం ఏ రాజకీయ పార్టీ తొత్తు కాదు. ప్రతి రాజకీయ పార్టీ సమానమే. ఒమిక్రాన్ వేవ్ కారణంగా ఎన్నికల ర్యాలీలపై నిషేధం విధించిన సమయంలో, EC MCC ఉల్లంఘనలను తీవ్రంగా పరిగణించింది. మొత్తం 5 రాష్ట్రాల్లో కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించినందుకు అలాగే MCC ఉల్లంఘనలకు సంబంధించి దాదాపు 2,270 ఎఫ్ఐఆర్లు నమోదు చేయబడ్డాయని అన్నారు.