Bus Catches Fire: ముంబైలో ఘోర అగ్ని ప్రమాదం, మంటలు చెలరేగి నడిరోడ్డుపై మాడి మసైపోయిన బస్సు, ప్రయాణికులంతా సేఫ్

ముంబైలో బాంద్రా ప్రాంతంలో బృహన్‌ ముంబైకి చెందిన విద్యుత్‌ బస్సులో భారీగా మంటలు చెలరేగాయి. అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై బస్సు అగ్నికి ఆహుతైంది. ఒక్కసారిగా బస్సులో మంటలు చెలరేగడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

Bus Catches Fire (Photo-ANI)

ముంబైలో బాంద్రా ప్రాంతంలో బృహన్‌ ముంబైకి చెందిన విద్యుత్‌ బస్సులో భారీగా మంటలు చెలరేగాయి. అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై బస్సు అగ్నికి ఆహుతైంది. ఒక్కసారిగా బస్సులో మంటలు చెలరేగడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి భారీ ఎత్తున ఎగసిపడుతున్న మంటలను అదుపుచేశారు. ఘటనకు సమీపంలో పెట్రోల్‌ బంక్‌ ఉండటంతో మంటలు వ్యాపించకుండా అధికారులు ఆర్పివేశారు. ఈ మంటల్లో బస్సు పూర్తిగా కాలిపోయింది. ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

Here's ANI Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement