Bharat Atta Launched: 27 రూపాయలకే కిలో భారత్ బ్రాండ్ గోధుమ పిండి, విక్రయం కోసం 100 మొబైల్ వ్యాన్‌లను జెండా ఊపి ప్రారంభించిన కేంద్రమంత్రి పీయూష్ గోయల్

భారత్' బ్రాండ్‌లో గోధుమ పిండి (అట్టా) విక్రయం కోసం 100 మొబైల్ వ్యాన్‌లను కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ శాఖ మంత్రి పీయూష్ గోయల్ సోమవారం న్యూఢిల్లీలోని కర్తవ్య పథ్ నుండి జెండా ఊపి ప్రారంభించారు

Govt Launches Sale of Atta Under Bharat Brand (Photo Credits: X/@PIB_India)

'భారత్' బ్రాండ్‌లో గోధుమ పిండి (అట్టా) విక్రయం కోసం 100 మొబైల్ వ్యాన్‌లను కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ శాఖ మంత్రి పీయూష్ గోయల్ సోమవారం న్యూఢిల్లీలోని కర్తవ్య పథ్ నుండి జెండా ఊపి ప్రారంభించారు.కిలో రూ.27.50కి మించకుండా ఎంఆర్‌పీతో గోధుమపిండి లభిస్తుంది. 'భారత్' బ్రాండ్ అట్టా యొక్క రిటైల్ విక్రయాన్ని ప్రారంభించడం వలన మార్కెట్‌లో సరసమైన ధరలకు సరఫరా పెరుగుతుంది. ఈ ముఖ్యమైన ఆహార పదార్ధం ధరల నియంత్రణను కొనసాగించడంలో సహాయపడుతుందని అధికారిక వర్గాలు తెలిపాయి.

సోమవారం (నవంబర్ 6) నుండి కేంద్రీయ భండార్, NAFED, NCCF యొక్క అన్ని అవుట్‌లెట్లలో భారత్' అట్టా అందుబాటులో ఉంటుంది. అలాగే ఇతర సహకార రిటైల్ అవుట్‌లెట్‌లకు విస్తరించబడుతుంది. దాదాపు 2.5 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమలను కిలోకు రూ. 21.50 చొప్పున సెమీ-గవర్నమెంట్, కోఆపరేటివ్ ఆర్గనైజేషన్స్ అంటే కేంద్రీయ భండార్, NCCF, NAFED కోసం ఓపెన్ మార్కెట్ సేల్ స్కీమ్ (OMSS (D)) కింద అట్టాగా మార్చడానికి, విక్రయించడానికి కేటాయించబడింది

Here's Video

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

SC On BRS MLAs' Case: రోగి చనిపోతే ఆపరేషన్ విజయవంతమా, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు విచారణలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు, తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ

1xBet బ్రాండ్‌ అంబాసిడర్‌గా క్రికెట్‌ స్టార్‌ హెన్రిచ్‌ క్లాసీన్, సౌతాఫ్రికాత్ స్టార్‌తో ఒప్పందం చేసుకున్న గ్లోబల్‌ కంపెనీ

Mamunoor Airport: మామునూరు ఎయిర్ పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్..ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హర్షం

Hindi Language Row in Tamil Nadu: వీడియో ఇదిగో, తమిళనాడులో బోర్డుల మీద హిందీ అక్షరాలను చెరిపేస్తున్న డీఎంకే కార్యకర్తలు, కొత్త విద్యా విధానాన్ని అమలు చేయబోమని స్పష్టం

Advertisement
Advertisement
Share Now
Advertisement