Bihar Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం, ఆగి ఉన్న టెంపోను ఢీకొట్టిన ట్రక్కు, నలుగురు అక్కడికక్కడే మృతి, మరో 7 మందికి గాయాలు
బీహార్లోని భోజ్పూర్ జిల్లాలో గురువారం వేగంగా వస్తున్న ట్రక్కు ఆగి ఉన్న టెంపోను ఢీకొట్టిన ప్రమాదంలో కనీసం నలుగురు మృతి చెందగా, ఏడుగురు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, సుహాగన్ దేవి (50), సుభాగ్య దేవి (65), సిరతియా దేవి (65), 12 ఏళ్ల బాలుడు అజీత్ కుమార్ ఉన్నారు.
బీహార్లోని భోజ్పూర్ జిల్లాలో గురువారం వేగంగా వస్తున్న ట్రక్కు ఆగి ఉన్న టెంపోను ఢీకొట్టిన ప్రమాదంలో కనీసం నలుగురు మృతి చెందగా, ఏడుగురు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, సుహాగన్ దేవి (50), సుభాగ్య దేవి (65), సిరతియా దేవి (65), 12 ఏళ్ల బాలుడు అజీత్ కుమార్ ఉన్నారు. జిల్లా కేంద్రమైన ఆరాలోని షాపూర్ బజార్ సమీపంలోని అరా-బక్సర్ హైవేపై వేగంగా వస్తున్న ట్రక్కు ఆగి ఉన్న టెంపోను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.
ముగ్గురు మహిళలు, ఒక బాలుడు సహా నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించగా, మరో ఏడుగురు గాయపడ్డారు. గాయపడిన వారందరినీ సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు, అక్కడ వారు చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి స్థిరంగా ఉందని చెబుతున్నారు" అని భోజ్పూర్ పోలీసు సూపరింటెండెంట్ రాజ్ పిటిఐకి తెలిపారు.ట్రక్ డ్రైవర్ వాహనాన్ని అక్కడే వదిలేసి పారిపోయాడని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.
Bihar Road Accident: