Video: షాకింగ్ వీడియో ఇదిగో, పడుకుని మొబైల్ చూస్తూ ఫుట్‌బోర్డ్ నుండి పట్టాలపై పడి మరణించిన యువకుడు

ఈ సంఘటన మధ్యాహ్నం 2:30 గంటలకు చోటు చేసుకుంది. రద్దీగా ఉండే అన్‌రిజర్వ్‌డ్ కంపార్ట్‌మెంట్ మెట్లపై కూర్చున్న బాలమురుగన్ తన బ్యాలెన్స్ తప్పి ప్లాట్‌ఫారమ్ 4 పై పడిపోయాడు.

Man dies after falling off speeding train (Photo Credit: X/@anglenewsagency)

కడలూరుకు చెందిన పి బాలమురుగన్ (24) అనే వ్యక్తి బుధవారం మధ్యాహ్నం చెన్నైలోని సైదాపేట రైల్వే స్టేషన్‌లో వైగై ఎక్స్‌ప్రెస్ ఫుట్‌బోర్డ్ నుండి పడి మరణించాడు. ఈ సంఘటన మధ్యాహ్నం 2:30 గంటలకు చోటు చేసుకుంది. రద్దీగా ఉండే అన్‌రిజర్వ్‌డ్ కంపార్ట్‌మెంట్ మెట్లపై కూర్చున్న బాలమురుగన్ తన బ్యాలెన్స్ తప్పి ప్లాట్‌ఫారమ్ 4 పై పడిపోయాడు.

ఆరేళ్ల చిన్నారిపై వీధి కుక్క దాడి.. తీవ్రంగా గాయాలు.. నిజామాబాద్ లో ఘటన (వీడియో)

రైలు, ప్లాట్‌ఫారమ్ మధ్య నలిగిపోయాడు. సీసీటీవీ ఫుటేజీలో ఈ ఘోర ప్రమాద దృశ్యాలు రికార్డయ్యాయి. పోలీసులు అతని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. బాలమురుగన్ తన మొబైల్ ఫోన్‌ను ఉపయోగిస్తున్నాడని అది వాడుతూ అతను జారిపడ్డాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు జరుపుతున్నారు.

Here's Video