Haryana Road Accident: ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరు మంది అక్కడికక్కడే మృతి, పంచర్‌ అయిన కారు టైరు మారుస్తుండగా వేగంగా వచ్చి ఢీకొట్టిన ఎక్స్‌యూవీ

హర్యానాలోని రెవారీలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటు చేసుకుంది. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత రెవారీ (Rewari) సమీపంలోని మసానీ వద్ద ఆగి ఉన్న ఓ కారును ఎక్స్‌యూవీ వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో అక్కడ ఉన్న ఆరుగురు మరణించారు.

Haryana Road Accident (Photo-ANI)

హర్యానాలోని రెవారీలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటు చేసుకుంది. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత రెవారీ (Rewari) సమీపంలోని మసానీ వద్ద ఆగి ఉన్న ఓ కారును ఎక్స్‌యూవీ వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో అక్కడ ఉన్న ఆరుగురు మరణించారు. వారిలో నలుగురు మహిళలు ఉన్నారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం ధాటికి కారు పూర్తిగా ధ్వంసమైంది. కాగా కారు టైరు పంచర్‌ కావడంతో రోడ్డు పక్కన నిలిపి.. టైరును మారుస్తుండగా, వెనుక నుంచి వచ్చిన ఎక్స్‌యూవీ దానిని ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Here's ANI Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement