Jitendra Awhad Remarks Row: వీడియో ఇదిగో, ఆ మాంసాహారం వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపిన అవద్, ఎవరి మనోభావాలను దెబ్బతీయాలని అనుకోలేదని వెల్లడి

వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగడంతో అవద్ మళ్లీ స్పందించారు. "మాంసాహారం" వ్యాఖ్యపై.. నేను నా విచారం వ్యక్తం చేస్తున్నాను, నేను ఎవరి మనోభావాలను దెబ్బతీయాలని అనుకోలేదు" అని అన్నారు.

Jitendra Awhad (photo-ANI)

మహారాష్ట్రకు చెందిన ఎన్సీపీ నేత జితేంద్ర అవద్ శ్రీరామునిపై చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్న సంగతి విదితమే. రాముడు నాన్ వెజ్ తింటాడని అతను క్షత్రియుడంటూ వ్యాఖ్యలు చేశారు. తన వ్యాఖ్యలపై జితేంద్ర అవద్ స్పందిస్తూ..రాముడు ఏమి తిన్నాడనే విషయంపై వివాదం ఎందుకుని ప్రశ్నించిన అవద్.. రాముడు క్షత్రియుడు.

క్షత్రియులు మాంసాహారులు. వారు తప్పకుండా నాన్ వెజ్ ను తిన్నారన్నారు. అంతే కాకుండా తన వ్యాఖ్యలకు తాను కట్టుబడి ఉన్నానని, దేశ జనాభాలో 80% మంది మాంసాహారులు, వారు కూడా రామభక్తులు అని చెప్పడం కొసమెరుపు. అయితే ఈ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగడంతో అవద్ మళ్లీ స్పందించారు. "మాంసాహారం" వ్యాఖ్యపై.. నేను నా విచారం వ్యక్తం చేస్తున్నాను, నేను ఎవరి మనోభావాలను దెబ్బతీయాలని అనుకోలేదు" అని అన్నారు.  శ్రీరాముడు మాంసాహారే, నా వ్యాఖ్యలు వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని తెలిపిన ఎన్సీపీ నేత జితేంద్ర అవద్

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement