Karnataka Road Accident: కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం, కాలువలో కారు పడిపోవడంతో ఐదుగురు మృతి, కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు
కర్నాటకలో మాండ్య జిల్లాలోని పాండవపుర సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటుచేసుకుంది. కాలువలో కారు పడిపోవడంతో వాహనంలో ప్రయాణిస్తున్న ఐదుగురు మరణించారు. విశ్వేశ్వరయ్య కాలువలో బుధవారం కారు పడిపోవడంతో ఐదుగురు వ్యక్తులు మరణించారని పోలీసులు తెలిపారు.
కర్నాటకలో మాండ్య జిల్లాలోని పాండవపుర సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటుచేసుకుంది. కాలువలో కారు పడిపోవడంతో వాహనంలో ప్రయాణిస్తున్న ఐదుగురు మరణించారు. విశ్వేశ్వరయ్య కాలువలో బుధవారం కారు పడిపోవడంతో ఐదుగురు వ్యక్తులు మరణించారని పోలీసులు తెలిపారు. ఘటనా స్ధలానికి చేరుకున్న సహాయ సిబ్బంది కాలువ నుంచి మృతదేహాలను వెలికితీశారు.
మృతులందరూ తుముకూరు జిల్లాలోని తిప్తూర్కు చెందిన వారని పోలీసులు వెల్లడించారు. మైసూర్లో జరిగిన ఓ ఫంక్షన్లో పాల్గొని తిరిగివస్తుండగా ఘటన చోటు చేసుకుంది. మృతులను చంద్రప్ప, కృష్ణప్ప, ధనుంజయ్, బాబు, జయన్నగా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు తదుపరి దర్యాప్తు ముమ్మరం చేశారు.
Here's News
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Sircilla Horror: సిరిసిల్ల జిల్లాలో ఘోరం.. లిఫ్ట్ రాకముందే తెరచుకున్న లిఫ్డ్ డోర్.. గమనించకుండా మూడో అంతస్తు పైనుంచి పడి కమాండెంట్ మృతి (వీడియో)
Accident Averted at Hyderabad Airport: వీడియో ఇదిగో, శంషాబాద్ ఎయిర్పోర్టులో విమానానికి తప్పిన పెను ప్రమాదం, 150 మంది ప్రయాణికులు సేఫ్
Fire Accidents: పచ్చని అడవుల్లో అగ్ని ప్రమాదం.. తెలుగు రాష్ట్రాల్లో మూడు అటవీ ప్రాంతాల్లో ప్రమాదాలు.. కిలోమీటర్ల మేర బూడిదైన చెట్లు
Advertisement
Advertisement
Advertisement