Ganesh Chaturthi 2022: కర్ణాటక హైకోర్టు అర్థరాత్రి సంచలన తీర్పు, హుబ్బళ్లి-ధర్వాడ్‌లో ఉన్న ఈద్గా మైదానంలో గణేశ్ ఉత్సవాలకు అనుమతి

కర్ణాటక హైకోర్టు మంగళవారం అర్ధరాత్రి తీర్పు సంచలన తీర్పు వెలువరించింది. హుబ్బళ్లి-ధర్వాడ్‌లో ఉన్న ఈద్గా (Eidgah) మైదానంలో గణేశ్‌ చతుర్థి ఉత్సవాలకు అనుమతించింది.నవరాత్రి వేడుకలు ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని సూచించింది.

Karnataka High Court (Photo Credits: Wikimedia Commons)

హుబ్బళ్లి-ధర్వాడ్‌లో ఉన్న ఈద్గా (Eidgah) మైదానంలో గణేశ్‌ చతుర్థి ఉత్సవాలకు అనుమతిస్తూ మంగళవారం అర్ధరాత్రి కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నవరాత్రి వేడుకలు ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని సూచించింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించింది.

హుబ్బళ్లీ ఈద్గా మైదానంలో గణేశుని వేడుకలు నిర్వహించడానికి నగర మున్సిపల్‌ కమిషనర్‌ అనుమతించారు. దీనికి వ్యతిరేకంగా అంజుమన్‌ ఈ ఇస్లామ్‌ సంస్థ హైకోర్టుకు వెళ్లింది. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్‌ అశోక్‌ ఎస్‌ కినాగి.. ఈద్గా ఆస్తి ధార్వాడ్ మున్సిపాలిటీకి చెందిందని, అంజుమన్-ఏ-ఇస్లాం సంవత్సరానికి ఒక్క రూపాయి రుసుముతో 999 సంవత్సరాల కాలానికి లీజుదారుగా మాత్రమే ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వ స్థలంలో వినాయకుని వేడుకలు అనుమతిస్తూ.. పిటిషన్‌ను తిరస్కరించారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement