BJP MLA Shoots Video: వీడియో ఇదిగో, పోలీస్టేషన్‌లో శివసేన నేతలపై కాల్పులు జరిపిన బీజేపీ ఎమ్మెల్యే, కాల్పులపై తనకు ఎలాంటి పశ్చాత్తాపం లేదని వెల్లడి

మహారాష్ట్రలో ఏక్‌నాథ్‌ షిండే వర్గం, బీజీపీ వర్గం మధ్య కాల్పులు చోటు చేసుకున్నది. ఉల్హాస్‌నగర్ పోలీస్ స్టేషన్లో శివసేన నేత మహేశ్ గైక్వాడ్‌పై బీజేపీ ఎమ్మెల్యే గణపతి గైక్వాడ్‌ తుపాకితో కాల్పులు జరిపాడు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మహేశ్ గైక్వాడ్‌ని పోలీసులు ఆస్పత్రికి తరలించారు

BJP MLA Shoots Shiv Sena Leader Inside Hill Lines Police Station (Photo Credit: X/@snehamordani)

మహారాష్ట్రలో ఏక్‌నాథ్‌ షిండే వర్గం, బీజీపీ వర్గం మధ్య కాల్పులు చోటు చేసుకున్నది. ఉల్హాస్‌నగర్ పోలీస్ స్టేషన్లో శివసేన నేత మహేశ్ గైక్వాడ్‌పై బీజేపీ ఎమ్మెల్యే గణపతి గైక్వాడ్‌ తుపాకితో కాల్పులు జరిపాడు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మహేశ్ గైక్వాడ్‌ని పోలీసులు ఆస్పత్రికి తరలించారు.కాల్పులకు పాల్పడ్డ ఎమ్మెల్యే గణ్‌పత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. అయితే ఈ ఘటన పోలీస్ స్టేషన్లో జరగడం షాకింగ్ కు గురి చేస్తోంది. ఓ భూమికి సంబంధించిన వివాదం నేపథ్యంలో ఈఘటన జరిగినట్లు సమాచారం.

కాల్పులపై తనకు ఎలాంటి పశ్చాత్తాపం లేదని పేర్కొన్నారు. తన కొడుకుని కళ్లెదుటే పోలీసు స్టేషన్‌లో కొడుతుంటే చూసి తట్టుకోలేకపోయానని.. అందుకే కాల్పులు జరిపినట్టు నిందితుడు తెలిపారు.కాల్పుల అనంతరం గణ్‌పత్‌ గైక్వాడ్‌ నుంచి పోలీసులు గన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆయనపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. గణ్‌పత్ గైక్వాడ్‌తో పాటు మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనను పోలీస్‌స్టేషన్‌లో హాజరుపరుచగా.. జిల్లా కోర్టు ఈ నెల 14 వరకు రిమాండ్‌ విధించింది.

Here's Shoot Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement