Boat Capsizes in River Ganga: గంగానదిలో ఘోర ప్రమాదం, పడవ బోల్తా పడి నలుగురు మృతి, మరో 25 మంది గల్లంతు, కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

యూపీ (Uttar Pradesh)లోని బల్లియా జిల్లా (Ballia district)లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. సుమారు 40 మందితో వెళ్తున్న పడవ మల్దేపూర్‌ గంగా ఘాట్‌ (Maldepur Ganga Ghat) సమీపంలో గంగా నది (River Ganga)లో బోల్తాపడింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.

Representtaional Image (Photo Credits: Pixabay)

యూపీ (Uttar Pradesh)లోని బల్లియా జిల్లా (Ballia district)లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. సుమారు 40 మందితో వెళ్తున్న పడవ మల్దేపూర్‌ గంగా ఘాట్‌ (Maldepur Ganga Ghat) సమీపంలో గంగా నది (River Ganga)లో బోల్తాపడింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. నీటిలో మునిగిపోయిన కొందరిని రక్షించి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో 25 మంది వరకు గల్లంతైనట్లు అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఘటనాస్థలి వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గల్లంతైన వారికోసం అధికారులు గాలింపు చేపడుతున్నారు. సామర్థ్యానికి మించి పడవలో ప్రయాణికుల్ని ఎక్కించడమే ఈ ఘటనకు కారణమని తెలుస్తోంది.

Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement