Man Thrown off Running Train: దారుణం, కదులుతున్న రైల్లో నుంచి 40 ఏళ్ళ వ్యక్తిని కిందకు తోసేసిన మరో వ్యక్తి, తీవ్ర గాయాలతో మృతి చెందిన బాధితుడు

యూపీలో దొంగతనం చేశాడని ఒక వ్యక్తిని దారుణంగా కొట్టి..కదులుతున్న ట్రైయిన్‌ నుంచి తోసేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన అయోధ్య- ఢీల్లీ ఎక్స్‌ప్రెస్‌ రైలులో చోటుచేసుకుంది.దీనికి సంబంధించి వీడియో వైరల్ అవుతోంది.

Representational Image | (Photo Credits: PTI)

యూపీలో దొంగతనం చేశాడని ఒక వ్యక్తిని దారుణంగా కొట్టి..కదులుతున్న ట్రైయిన్‌ నుంచి తోసేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన అయోధ్య- ఢీల్లీ ఎక్స్‌ప్రెస్‌ రైలులో చోటుచేసుకుంది.దీనికి సంబంధించి వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఒక జనరల్‌ కంపార్ట్‌మెంట్‌ బోగిలో 40 ఏళ్ల నరేంద్ర దూబే అనే వ్యక్తి బాధితుడిని ఫోన్‌ దొంగలించినందుకు క్రూరంగా కొడుతున్నట్లు కనిపించింది.

పక్కనే ఉన్న మరో ప్రయాణికుడు నవ్వుతూ కనిపించాడు. ఆ తర్వాత బాధితుడిని పనిష్మెంట్‌ కింద కదులుతున్న ట్రైయిన్‌ నుంచి తోసేస్తున్నట్లు..సదరు బాధితుడు భయంతో అరుస్తున్న కేకలు ఆ వీడియోలో వినిపించాయి.దీంతో పోలీసులు సదరు ప్రయాణికుడు నరేంద్ర దూబేని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఈ ఘటన జరిగిన కొద్దిసేపటి తర్వాత ఒక మహిళన తన మొబైల్‌ ఫోన్‌ షాజహాన్‌పూర్‌ రైల్వేస్టేషన్‌లో పోయిందని ఫిర్యాదు చేసినట్లు విచారణలో తేలింది.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement