Uttarakhand Tunnel Rescue Operation Update: ఉత్తరకాశీ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్, బయటకు వచ్చిన మొదటి కూలీ, గంటలోపు దాదాపు ఆపరేషన్ సక్సెస్ అవుతుందని తెలిపిన సీఎం దామి
ఉత్తరాఖండ్లో నిర్మాణంలో ఉన్న సొరంగం పాక్షికంగా కూలిపోయిన ఘటనలో చిక్కుకున్న కూలీలంతా క్షేమంగానే ఉన్నారు. మంగళవారం సాయంత్రం ఒక్కొక్కరిని బయటకు సురక్షితంగా తీసుకొస్తున్నారు. గంటలోపు దాదాపు ఆపరేషన్ విజయవంతంగా పూర్తి అవుతుందని రెస్క్యూటీం ప్రకటించింది
ఉత్తరాఖండ్లో నిర్మాణంలో ఉన్న సొరంగం పాక్షికంగా కూలిపోయిన ఘటనలో చిక్కుకున్న కూలీలంతా క్షేమంగానే ఉన్నారు. మంగళవారం సాయంత్రం ఒక్కొక్కరిని బయటకు సురక్షితంగా తీసుకొస్తున్నారు. గంటలోపు దాదాపు ఆపరేషన్ విజయవంతంగా పూర్తి అవుతుందని రెస్క్యూటీం ప్రకటించింది. 17 రోజుల మారథాన్ ఆపరేషన్ తర్వాత, 41 మంది కార్మికులలో మొదటి కార్మికుడిని సిల్క్యారా సొరంగం నుండి తరలించారు.
చిక్కుకున్న మిగిలిన కార్మికులను బయటకు తీసుకురావడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. సహాయక చర్యలు చివరి దశకు చేరుకోవడంతో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి మాట్లాడుతూ శిథిలాల మధ్య చిక్కుకున్న 41 మంది కార్మికులను బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు సిల్క్యారా సొరంగం లోపలికి పైపులు నెట్టడం జరిగిందని చెప్పారు. అంతకు ముందు దాదాపు 17 రోజులుగా సొరంగంలో ఉన్న వీరి వద్దకు ఆరు అంగుళాల వ్యాసం ఉన్న గొట్టాన్ని పంపించారు. ఆ పైప్ ద్వారా ఓ ఎండోస్కోపీ తరహా కెమెరాను పంపగా.. కూలీలంతా సురక్షితంగా ఉన్నట్లు అందులో కన్పించింది. ఈ దృశ్యాలను రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఎక్స్లో పంచుకున్నారు.
Here's Video