Goods Train Passes Over Woman Video: వీడియో ఇదిగో, స్పృహ కోల్పోయి పట్టాలపై పడిపోయిన మహిళ, వెంటనే పట్టాలపైకి దూసుకువచ్చిన గూడ్స్ రైలు

ఉత్తరప్రదేశ్‌లోని కాస్‌గంజ్ రైల్వే స్టేషన్‌లో రైల్వే ట్రాక్ దాటే క్రమంలో ఓ మహిళ స్పృహ కోల్పోయి పట్టాలపై పడిపోయింది. వెంటనే ఆ పట్టాలపైకి గూడ్స్ రైలు వచ్చింది. స్థానికులు కదలకుండా అలాగే ఉండమని చెప్పడంతో సదరు మహిళ పట్టాల మధ్యలో అలాగే పడుకుంది

Train (Representational Image. Source-Twitter)

ఉత్తరప్రదేశ్‌లోని కాస్‌గంజ్ రైల్వే స్టేషన్‌లో రైల్వే ట్రాక్ దాటే క్రమంలో ఓ మహిళ స్పృహ కోల్పోయి పట్టాలపై పడిపోయింది. వెంటనే ఆ పట్టాలపైకి గూడ్స్ రైలు వచ్చింది. స్థానికులు కదలకుండా అలాగే ఉండమని చెప్పడంతో సదరు మహిళ పట్టాల మధ్యలో అలాగే పడుకుంది. దీంతో గూడ్స్ రైలు ఆమె మీదుగా వెళ్లింది. కానీ ఆమె సరిగ్గా పట్టాల మధ్యలో పడుకోవడంతో రైలు మీది నుంచి పోయినప్పటికీ ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. రైలు వెళ్లాక పట్టాల మీద ఉన్న సదరు మహిళను స్థానికులు బయటికి తీసుకొచ్చి రక్షించారు.దీనికి సంబంధించిన 32 సెకన్ల వీడియోను ట్విట్టర్‌లో అప్‌లోడ్ చేయగా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement