Raids on After 9 Pub: హైదరాబాద్ లోని ఆఫ్టర్‌ నైన్‌ పబ్‌ పై దాడి.. 32 మంది యువతులు సహా 167 మంది అరెస్ట్‌

హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్‌ లో ఉన్న ఆఫ్టర్‌ నైన్‌ పబ్‌పై పోలీసులు కేసు నమోదుచేశారు.

Raids on After 9 Pub (Credits: X)

Hyderabad, May 5: హైదరాబాద్ (Hyderabad) నగరంలోని బంజారాహిల్స్‌ లో ఉన్న ఆఫ్టర్‌ నైన్‌ పబ్‌పై (After 9 Pub) పోలీసులు కేసు నమోదుచేశారు. నిబంధనలకు విరుద్ధంగా పబ్‌ ను నడుపుతున్నట్లు సమాచారం అందడంతో వెస్ట్‌ జోన్‌ పోలీసులు శనివారం అర్ధరాత్రి దాడులు చేశారు. ఈ సందర్భంగా 167 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో మద్యం మత్తులో అశ్లీల నృత్యాలు చేస్తున్న 32 మంది యువతులు, 75 మంది యువకులు ఉన్నారు. కస్టమర్లను ఆకర్శించడానికి పబ్‌ నిర్వాహకులు కర్ణాటకలోని గుల్బర్గా నుంచి యువతులను రప్పించినట్లు తెలుస్తున్నది.

2024 భారతదేశం ఎన్నికలు: తెలంగాణలో హీటెక్కిన లోక్ సభ ఎన్నికల సమరం.. నేడు మూడు సభల్లో పాల్గొననున్న హోంమంత్రి అమిత్ షా.. రెండు చోట్ల ప్రసంగించనున్న రాహుల్ గాంధీ.. జగిత్యాలలో గులాబీ దళాధిపతి కేసీఆర్ బస్సు యాత్ర

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement