Delicious Twist in Democracy: ఓటు వేసిన వారికి.. ఉచితంగా పోహా, జిలేబీ పంపిణీ.. ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రజలను ప్రొత్సహించేందుకు మధ్యప్రదేశ్ స్వీట్ షాపు యజమాని చొరవ.. వీడియో వైరల్
ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రజలను ప్రొత్సహించేందుకు ఒక స్వీట్ షాపు యజమాని చొరవచూపాడు. ఉదయం వేళ ఓటు వేసిన వారికి పోహా, జిలేబీని ఉచితంగా పంపిణీ చేశాడు.
Bhopal, Nov 18: ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రజలను ప్రొత్సహించేందుకు ఒక స్వీట్ షాపు యజమాని (Sweetshop Owner) చొరవచూపాడు. ఉదయం వేళ ఓటు వేసిన వారికి పోహా, జిలేబీని ఉచితంగా పంపిణీ చేశాడు. మధ్యప్రదేశ్లోని 230 అసెంబ్లీ స్థానాలకు శుక్రవారం పోలింగ్ జరిగింది. (Madhya Pradesh Assembly Polls) ఈ నేపథ్యంలో ఓటర్లను ఉత్సాహపరిచేందుకు ఇండోర్ కు చెందిన ఒక స్వీట్ షాప్ ఓనర్ ప్రయత్నించాడు. ఉదయం 6 గంటల నుంచి 9.30 గంటల మధ్య ఓటు హక్కు వినియోగించుకున్న వారికి పోహా (Poha), జిలేబీని ఉచితంగా పంపిణీ చేశాడు. వేలిపై సిరా మార్క్ చూపించిన వారికి వీటిని అందజేశాడు. ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న వారు తమ బాధ్యతను చక్కగా నిర్వర్తించారని కొనియాడాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Advertisement
Advertisement
Advertisement