KTR Viral Video: సాధారణ పౌరుడిలా పాతబస్తీలోని షాదాబ్ హోటల్ కు వెళ్లి బిర్యానీ ఆర్డర్ చేసిన కేటీఆర్.. గుర్తుపట్టి షాకైన జనం.. ఆ తర్వాత ఏమైంది?? వీడియో ఇదిగో..
ఇటీవల నిలోఫర్ కేఫ్ లో సందడి చేసిన కేటీఆర్.. గతరాత్రి షాబాద్ హోటల్కి వెళ్లి అందరినీ ఆశ్చర్యపరిచారు.
Hyderabad, Nov 18: తెలంగాణలో (Telangana) మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగనున్న వేళ మంత్రి కేటీఆర్ (KTR) వీలైనంతగా జనంలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇటీవల నిలోఫర్ కేఫ్ లో సందడి చేసిన కేటీఆర్.. గతరాత్రి షాబాద్ హోటల్ కి (Shabad Hotel) వెళ్లి అందరినీ ఆశ్చర్యపరిచారు. పాతబస్తీలోని మదీనా చౌరస్తా వద్దకు ఎలాంటి ప్రొటోకాల్ లేకుండా సాధారణ పౌరుడిలా వచ్చి బిర్యానీ ఆర్డర్ ఇచ్చారు. తొలుత ఎవరూ ఆయనను గుర్తుపట్టలేదు. ఆ తర్వాత తమతో ఉన్నది మంత్రి కేటీఆర్ గుర్తించి అవాక్కయ్యారు. ఆ వెంటనే హోటల్ సందడిగా మారిపోయింది. ఆయనను చూసేందుకు, సెల్ఫీలు తీసుకునేందుకు అక్కడున్న వారు ఎగబడ్డారు. మంత్రి అనంతరం అక్కడి నుంచి మొజంజాహి మార్కెట్కు వెళ్లి ఐస్క్రీం రుచి చూశారు.