IND vs WI 2nd ODI 2022: రెండో వన్డే గెలుపుతో రికార్డులు నెలకొల్పిన భారత్, వెస్టిండీస్పై భారత్కు ఇది వరుసగా 12వ వన్డే సిరీస్ విజయం
వెస్టిండీస్తో ఉత్కంఠంగా సాగిన రెండో వన్డేలో యువ భారత్ 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపు ద్వారా భారత జట్టు మూడు వన్డేల సిరీస్లో 2-0తో మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ సొంతం చేసుకుంది. వెస్టిండీస్పై భారత్కు ఇది వరుసగా 12వ వన్డే సిరీస్ విజయం.
వెస్టిండీస్తో ఉత్కంఠంగా సాగిన రెండో వన్డేలో యువ భారత్ 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపు ద్వారా భారత జట్టు మూడు వన్డేల సిరీస్లో 2-0తో మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ సొంతం చేసుకుంది. వెస్టిండీస్పై భారత్కు ఇది వరుసగా 12వ వన్డే సిరీస్ విజయం. 2006 తర్వాత ఇండియా-వెస్టిండీస్ మధ్య జరిగిన వన్డే సిరీస్లలో ఏ ఒక్కటి కూడా టీమిండియా ఓడలేదు. అప్పట్నుంచి ఇరుదేశాల మధ్య జరిగిన 12 వన్డే సిరీస్లనూ భారత్ నెగ్గింది.
రెండో వన్డేలో బౌలింగ్లో విఫలమైనా భారత బ్యాటర్లు పట్టుదలతో ఆడి ఇండియాకు విజయాన్ని అందించారు. 312 పరుగుల లక్ష్య ఛేదనలో శ్రేయాస్ అయ్యర్ (63), సంజూ శాంసన్ (54)తో పాటు చివర్లో అక్షర్ పటేల్ (35 బంతుల్లో 64 నాటౌట్) మెరుపులు మెరిపించడంతో భారత్ ఈ మ్యాచ్లో విజయాన్ని అందుకుంది.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Police Opposed Cricket Fans: క్రికెట్ ఫ్యాన్స్ పై పోలీసుల గుర్రు.. హైదరాబాద్ లోనే కాదు కరీంనగర్ లో కూడా.. పూర్తి వివరాలు ఇవిగో..!
AP Artist Celebrates Team India Victory: టీమిండియా విజయాన్ని ఆస్వాదిస్తున్న ఏపీ కళాకారుడు.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల అద్భుతమైన పెయింటింగ్ తో నీరాజనాలు
Lathi Charge On Cricket Fans: క్రికెట్ ఫ్యాన్స్ పై పోలీసుల లాఠీ ఛార్జ్.. హైదరాబాద్ లో ఘటన.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం
Rohit Sharma Clarity On Retirement: ‘వన్డే ఫార్మాట్ నుంచి ఇప్పుడే తప్పుకోవట్లేదు’.. రిటైర్మెంట్ ఊహాగానాలకు చెక్ పెట్టిన రోహిత్ శర్మ
Advertisement
Advertisement
Advertisement